Homeక్రైంDubai | దుబాయ్​లో భారత బిలియనీర్​కు జైలుశిక్ష.. రూ.340 కోట్ల ఆస్తులు జప్తు

Dubai | దుబాయ్​లో భారత బిలియనీర్​కు జైలుశిక్ష.. రూ.340 కోట్ల ఆస్తులు జప్తు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dubai | దుబాయ్​(dubai)లో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరుగాంచిన భారత్​కు చెందిన ధనవంతుడు billionaire బల్వీందర్‌ సింగ్‌ సాహ్నీ జైలు పాలయ్యారు. మనీలాండరింగ్​ పాల్పడ్డారని నమోదైన కేసులో దోషిగా తేలడంతో దుబాయి కోర్టు ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.1.14 కోట్ల జరిమానా fine విధించింది. అంతేగాకుండా దుబాయ్​లోని ఆయన ఆస్తులను జప్తు చేయాలని, జైలు శిక్ష పూర్తయ్యాక దేశం నుంచి బహిష్కరించాలని expelled from the country ఆదేశించింది.

Dubai | 2024లో కేసు

భారత్​కు చెందిన బల్విందర్​ సింగ్​ Balwinder Singh ఆర్‌ఎస్‌జీ RSG ప్రాపర్టీ డెవలప్‌మెంట్ కంపెనీని ప్రారంభించాడు. ఈ కంపెనీ యూఏఈ UAEతో పాటు అమెరికా US, భారత్‌ Bharat సహా పలు దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. అయితే ఆయన డొల్లా కంపెనీలు, నకిలీ ఇన్​వాయిస్​లతో దాదాపు రూ.340 కోట్ల మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2024లో బల్విందర్​సింగ్​తో పాటు మరికొందరిపై కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం బల్విందర్​ను దోషిగా తేలుస్తూ శిక్ష విధించింది. జైలు శిక్ష, జరిమానాతో పాటు, రూ.340 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. కాగా.. ఈ కేసులో బల్విందర్​ పెద్ద కుమారుడికి కూడా శిక్ష పడింది.

Dubai | నంబర్​ ప్లేట్​కే రూ.75 కోట్లు..

రాజ్‌ సాహ్ని గ్రూప్‌ (RSG) పేరుతో ప్రాపర్టీ డెవలప్‌మెంట్ కంపెనీని స్థాపించిన బల్వీందర్​కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. దీంతో కార్లు కొనుగోలు చేసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేసేవాడు. ఆయనకు ఇన్​స్టాగ్రామ్​లో 33 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. బల్విందర్​కు దుబాయ్‌ అనేక ఆస్తులు ఉన్నాయి. అయితే బల్విందర్​ 2016లో రోల్స్‌ రాయిస్‌ కార్‌ కోసం ఏకంగా 33 మిలియన్‌ దిర్హమ్‌లతో (దాదాపు రూ.75కోట్లతో) నంబరు ప్లేట్‌ కొనుగోలు చేసి, ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కారు. తాజాగా జైలుశిక్ష పడడంతో మరోసారి వార్తల్లో నిలిచారు.