Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | తాగిన మత్తులో వ్యక్తి వీరంగం.. కల్లుసీసాతో ముగ్గురిపై దాడి

Nizamabad City | తాగిన మత్తులో వ్యక్తి వీరంగం.. కల్లుసీసాతో ముగ్గురిపై దాడి

- Advertisement -

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad City | మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. నగరంలో మూడో డివిజన్​లో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

రూరల్​ ఎస్​హెచ్​వో ఆరిఫ్ (Rural SHO Arif)​ తెలిపిన వివరాల ప్రకారం.. గూపన్​పల్లిలో (Gupanpally) శనివారం రాత్రి మదన్ మద్యం తాగి ఓ కిరాణా షాప్​ ఎదుట నిద్రించాడు. ​ కిరాణాదుకాణానికి అనిల్, శైలేందర్ వెళ్లగా.. శైలేందర్​ కాలు మదన్​కు తాకింది. దీంతో కోపోద్రిక్తుడైన మదన్​ పక్కనే ఉన్న కల్లుదుకాణంలోకి వెళ్లి కల్లుసీసా తీసుకొచ్చి పగులగొట్టి వారిరువురిపై దాడికి పాల్పడ్డాడు. అడ్డువచ్చిన అనిల్​ అక్క దీపికపై కూడా దాడి చేశాడు.

దీంతో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. అనిల్​కు కడుపులో తీవ్రంగా గాయం కావడంలో పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిందితుడు మదన్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనిల్​ అక్క దీపిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.