అక్షరటుడే, వెబ్డెస్క్ : Chevella | హైదరాబాద్ (Hyderabad) నగరంలో డ్రగ్స్ వినియోగం పెరిగిపోతోంది. పార్టీలు, పబ్లు అంటూ యువత గంజాయి, డ్రగ్స్కు బానిసలుగా మారుతున్నారు. రిసార్ట్లు, ఫామ్హౌస్లలో పార్టీలో పేరిట డ్రగ్స్ తీసుకుంటున్నారు. తాజాగా రంగారెడ్డి (Rangareddy) జిల్లా చేవెళ్లలో డ్రగ్స్ తీసుకుంటూ ఐటీ ఉద్యోగులు పట్టుబడడం కలకలం రేపింది.
చేవెళ్లలోని సెరీన్ ఆచార్జ్ ఫాంహౌస్లో బర్త్డే వేడుకల (Birth Day Party) పేరుతో డ్రగ్స్, విదేశీ మద్యంతో ఐటీ ఉద్యోగులు (IT Employees) ఎంజాయ్ చేస్తుండగా.. పోలీసులు షాక్ ఇచ్చారు. ఫామ్హౌస్లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని పక్కా సమాచారం మేరకు ఎస్టీఎఫ్ బీ టీమ్, ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. డ్రగ్స్తో పాటు ఖరీదైన మద్యం స్వాధీనం చేసుకున్నారు.
బర్త్డే సందర్భంగా ఐటీ ఉద్యోగి అభిజిత్ బెనర్జీ ఈ ఫాంహౌస్ను బుక్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం ఆరుగురు ఐటీ ఉద్యోగులు పార్టీలో పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారు. ఐటీ ఉద్యోగులకు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి రూ.రెండు లక్షల విలువైన డ్రగ్స్, మూడు లగ్జరీ కార్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఐటీ ఉద్యోగులను అరెస్ట్ చేసి, పార్టీ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు.