HomeతెలంగాణEagle Team | రెస్టారెంట్​లో డ్రగ్స్ దందా.. ఆట కట్టించిన ఈగల్​ టీం

Eagle Team | రెస్టారెంట్​లో డ్రగ్స్ దందా.. ఆట కట్టించిన ఈగల్​ టీం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Eagle Team | రాష్ట్రంలో డ్రగ్స్​, గంజాయి దందా యథేచ్ఛగా సాగుతోంది. నగరాల నుంచి మొదలు పెడితే గ్రామాల వరకు గంజాయి దొరుకుతోంది. ఎంతో మంది యువత వీటికి బానిసలు మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో యువత భవిష్యత్​ను నాశనం చేసే డ్రగ్స్​పై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ఇటీవల డ్రగ్స్​ నిర్మూలనకు ఆయన ఈగల్​ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈగల్​ టీమ్​ అధికారులు(Eagle Team Officers) హైదరాబాద్​ నగరంలో దాడులు చేస్తూ.. డ్రగ్స్​ దందా చేస్తున్న వారి ఆట కట్టిస్తున్నారు. తాజాగా ఓ రెస్టారెంట్​ డ్రగ్స్​ ముఠా గుట్టు రట్టు చేశారు.

హైదరాబాద్‌లోని కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్‌(Malnadu Restaurant) కేంద్రంగా డ్రగ్స్‌ దందా నిర్వహిస్తున్నారు. రెస్టారెంట్‌ యజమాని సూర్య(Restaurant owner Surya) ఆధ్వర్యంలో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈగల్​ టీమ్​ రెస్టారెంట్​పై దాడి చేసింది. ప్రముఖ ఆస్పత్రి కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ ప్రసన్న(Cardiologist Dr. Prasanna)కు కూడా డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఏపీకి చెందిన ప్రసన్న ఇప్పటి వరకు ఈ రెస్టారెంట్​లో 20 సార్లు డ్రగ్స్‌ కొన్నట్లు గుర్తించారు. మరో 23 మంది వ్యాపారవేత్తలకు కూడా డ్రగ్స్​ సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు కేసు నమోదు చేశారు.

Eagle Team | ప్రముఖ పబ్​లకు సరఫరా

మల్నాడు రెస్టారెంట్ ఓనర్​ సూర్య నగరంలోని ప్రముఖ పబ్‌లకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నాడు. పబ్‌ యజమానులతో డ్రగ్స్‌ పార్టీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సూర్యతో పాటు ఆయనకు సహకరిస్తున్న హర్షలను ఈగల్‌ టీం అరెస్ట్​ చేసింది. అయితే రెస్టారెంట్​లో ఎంత మేర డ్రగ్స్​ దొరికాయనే వివరాలు తెలియరాలేదు.

Eagle Team | వరుస దాడులు

ఈగల్​ టీం అధికారులు వరుస దాడులతో డ్రగ్స్​ నియంత్రణకు చర్యలు చేపట్టారు. ఇటీవల ఉప్పల్ మైదానం వద్ద దాడులు చేసి భారీగా పట్టుకున్నారు. దాదాపు రూ.10 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అలాగే నాలుగు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో కిరాణ దుకాణం, హోటల్​ ముసుగులో గంజాయి విక్రయిస్తున్న పింటూ సింగ్​ అనే వ్యక్తిని అధికారులు అరెస్ట్​ చేశారు. నందిగామ(Nandigama) పారిశ్రామిక ప్రాంతంలోని అతడు నిర్వహిస్తున్న దుకాణంలో దాడి చేసి 2.5 కిలోల గంజాయి, 9 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.