ePaper
More
    HomeతెలంగాణEagle Team | రెస్టారెంట్​లో డ్రగ్స్ దందా.. ఆట కట్టించిన ఈగల్​ టీం

    Eagle Team | రెస్టారెంట్​లో డ్రగ్స్ దందా.. ఆట కట్టించిన ఈగల్​ టీం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Eagle Team | రాష్ట్రంలో డ్రగ్స్​, గంజాయి దందా యథేచ్ఛగా సాగుతోంది. నగరాల నుంచి మొదలు పెడితే గ్రామాల వరకు గంజాయి దొరుకుతోంది. ఎంతో మంది యువత వీటికి బానిసలు మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో యువత భవిష్యత్​ను నాశనం చేసే డ్రగ్స్​పై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ఇటీవల డ్రగ్స్​ నిర్మూలనకు ఆయన ఈగల్​ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈగల్​ టీమ్​ అధికారులు(Eagle Team Officers) హైదరాబాద్​ నగరంలో దాడులు చేస్తూ.. డ్రగ్స్​ దందా చేస్తున్న వారి ఆట కట్టిస్తున్నారు. తాజాగా ఓ రెస్టారెంట్​ డ్రగ్స్​ ముఠా గుట్టు రట్టు చేశారు.

    హైదరాబాద్‌లోని కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్‌(Malnadu Restaurant) కేంద్రంగా డ్రగ్స్‌ దందా నిర్వహిస్తున్నారు. రెస్టారెంట్‌ యజమాని సూర్య(Restaurant owner Surya) ఆధ్వర్యంలో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈగల్​ టీమ్​ రెస్టారెంట్​పై దాడి చేసింది. ప్రముఖ ఆస్పత్రి కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ ప్రసన్న(Cardiologist Dr. Prasanna)కు కూడా డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఏపీకి చెందిన ప్రసన్న ఇప్పటి వరకు ఈ రెస్టారెంట్​లో 20 సార్లు డ్రగ్స్‌ కొన్నట్లు గుర్తించారు. మరో 23 మంది వ్యాపారవేత్తలకు కూడా డ్రగ్స్​ సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు కేసు నమోదు చేశారు.

    Eagle Team | ప్రముఖ పబ్​లకు సరఫరా

    మల్నాడు రెస్టారెంట్ ఓనర్​ సూర్య నగరంలోని ప్రముఖ పబ్‌లకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నాడు. పబ్‌ యజమానులతో డ్రగ్స్‌ పార్టీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సూర్యతో పాటు ఆయనకు సహకరిస్తున్న హర్షలను ఈగల్‌ టీం అరెస్ట్​ చేసింది. అయితే రెస్టారెంట్​లో ఎంత మేర డ్రగ్స్​ దొరికాయనే వివరాలు తెలియరాలేదు.

    Eagle Team | వరుస దాడులు

    ఈగల్​ టీం అధికారులు వరుస దాడులతో డ్రగ్స్​ నియంత్రణకు చర్యలు చేపట్టారు. ఇటీవల ఉప్పల్ మైదానం వద్ద దాడులు చేసి భారీగా పట్టుకున్నారు. దాదాపు రూ.10 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అలాగే నాలుగు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో కిరాణ దుకాణం, హోటల్​ ముసుగులో గంజాయి విక్రయిస్తున్న పింటూ సింగ్​ అనే వ్యక్తిని అధికారులు అరెస్ట్​ చేశారు. నందిగామ(Nandigama) పారిశ్రామిక ప్రాంతంలోని అతడు నిర్వహిస్తున్న దుకాణంలో దాడి చేసి 2.5 కిలోల గంజాయి, 9 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...