DRDO emergency meeting | DRDO అత్యవసర సమావేశం.. చాందీపూర్ క్షిపణి శ్రేణి భద్రత కట్టుదిట్టం

అక్షరటుడే, న్యూఢిల్లీ: DRDO emergency meeting : భారత్​ పాక్​ నడుమ భయానక యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఈ క్రమంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) అత్యవసర సమావేశం నిర్వహించింది. మరోవైపు చాందీపూర్ క్షిపణి శ్రేణి భద్రతను పెంచింది. ఇక్కడ నాలుగు స్థాయిల భద్రతను పరిగణనలోకి తీసుకుంటారు. మొదట, ఒడిశా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. తర్వాత సైన్యం, అటు పిమ్మట DRDO సొంత భద్రతా బృందం, చివరగా ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) నాలుగో స్థాయి భద్రత అందిస్తున్నారు.