Homeజిల్లాలునిజామాబాద్​Railway DRM | రెండేళ్లలో డబ్లింగ్ పనులు పూర్తి: డీఆర్ఎం

Railway DRM | రెండేళ్లలో డబ్లింగ్ పనులు పూర్తి: డీఆర్ఎం

వచ్చే రెండేళ్లలో నిజామాబాద్ నుంచి ముద్కేడ్​ వరకు డబ్లింగ్ పనులు పూర్తవుతాయని సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్​ఎం సంతోష్​కుమార్​ వర్మ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నగరంలో పర్యటించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Railway DRM | వచ్చే రెండేళ్లలో నిజామాబాద్ (Nizmaabad) నుంచి ముథ్కేడ్​ వరకు డబ్లింగ్ ​(Doubling) పనులు పూర్తవుతాయని సౌత్ సెంట్రల్ రైల్వే (South Central Railway) డీఆర్​ఎం సంతోష్​కుమార్​ వర్మ తెలిపారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్​ను శుక్రవారం పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబ్లింగ్ పనులు ప్రస్తుతం మేడ్చల్ (Medical) వరకు పూర్తయ్యాయన్నారు. అలాగే నిజామాబాద్ రైల్వేస్టేషన్ (Nizamabad Railway Station) పనులు 50 శాతం పూర్తయ్యాయని, ఏప్రిల్ వరకు మొత్తం పూర్తయ్యే అవకాశం ఉందన్నారు.

స్టేషన్​కు అమృత్ పథకం కింద రూ.57కోట్ల బడ్జెట్ కేటాయించామన్నారు. ఐదు ఎస్కలేటర్లు, మూడు లిఫ్టులు ప్రయాణికుల కోసం వెయిటింగ్ హాల్​, పొడవైన ప్లాట్​ఫాం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో వర్షాలు పడితే ఇబ్బందులు ఏర్పడేవని, ప్రస్తుతం ప్లాట్​ఫామ్​ ఎత్తు పెంచామని, ఇకపై ఇబ్బందులు ఉండవన్నారు.

Railway DRM | నిజామాబాద్ మీదుగా ఢిల్లీకి ట్రైన్..

ప్రయాణికుల సౌకర్యార్థం నిజామాబాద్ మీదుగా సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి నిజాముద్దీన్ (Nizamuddin Express) ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు డీఆర్​ఎం పేర్కొన్నారు. ప్రస్తుతానికి తాత్కాలికంగా వారానికి రెండుసార్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికుల డిమాండ్ ఆధారంగా భవిష్యత్తులో రెగ్యులర్ చేస్తామన్నారు.

ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే రైలు నిజామాబాద్​కు 1:25 పీఎంకు చేరుకుంటుందని తెలిపారు. అలాగే నిజామాబాద్​లో ట్రాఫిక్​ను దృష్టిలో పెట్టుకొని గూడ్స్ షెడ్​ను జానకంపేట్​లో ఏర్పాటు చేశామన్నారు. దసరా, దీపావళి పండుగలను నిజామాబాద్ మీదుగా 34 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశామని వివరించారు. ఇందులో సుమారు 32 లక్షల మంది ప్రయాణించారని వివరించారు.