ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Collector Nizamabad | ఎరువుల కొరత రానీయవద్దు

    Collector Nizamabad | ఎరువుల కొరత రానీయవద్దు

    Published on

    అక్షరటుడే, ఇందల్వాయి: Collector Nizamabad | వర్షాకాలం సీజన్​ ప్రారంభమైనందున రైతులకు ఎరువుల కొరత రానివ్వొద్దని కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) ఆదేశించారు. మండల కేంద్రంలోని ఎరువుల గోదాములు, పశువుల ఆస్పత్రి, తహశీల్దార్​ కార్యాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సలహాలు సూచనలు అందజేశారు.

    Collector Nizamabad | దరఖాస్తులను ఆన్​లైన్​ చేయాలి..

    అనంతరం ఆయన మాట్లాడుతూ తహశీల్దార్​ కార్యాలయంలో రైతులు ఇచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్​లైన్​ చేయాలని సూచించారు. రేషన్​షాపుల్లో (Ration Shops) మూడునెలలకు సరిపడా పంపిణీ చేసిన రేషన్​ వివరాల రిజిస్టర్​ను తనిఖీ చేశారు. రైతులకు ఎరువుల కొరత రాకుండా చూడాలని తెలిపారు. ఇందల్వాయి గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న పశువుల ఆస్పత్రిని ఆయన పరిశీలించారు. సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహశీల్దార్​ వెంకటరావు, సీనియర్ అసిస్టెంట్ గంగ ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...