HomeతెలంగాణHyderabad Floods | ఎంజీబీఎస్​కు రావొద్దు.. బస్సులను దారి మళ్లించిన అధికారులు

Hyderabad Floods | ఎంజీబీఎస్​కు రావొద్దు.. బస్సులను దారి మళ్లించిన అధికారులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Floods | దసరా నేపథ్యంలో హైదరాబాద్(Hyderabad)​ నగరంలో నివసిస్తున్న ప్రజలు ఇళ్లకు వెళ్దామని ప్లాన్​ చేసుకున్నారు. ఈ తరుణంలో భారీ వర్షం ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మూసీ నదికి వరద పోటెత్తడంతో ఎంజీబీఎస్​ బస్టాండ్(MGBS Bus Stand)​ మునిగిపోయిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు ఎంజీబీఎస్​ను మూసి వేశారు. అక్కడికి బస్సులను అనుమతించడం లేదు. పండుగ నేపథ్యంలో ఇళ్లకు వెళ్లే ప్రజలు ఎంజీబీఎస్​కు రావొద్దని వారు సూచించారు. ఈ మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Hyderabad Floods | అక్కడి నుంచి బస్సులు

ఆదిలాబాద్​, నిర్మల్​, నిజామాబాద్​, కామారెడ్డి, మెదక్​ వైపు నుంచి వచ్చే బస్సులు జేబీఎస్​ నుంచి రాకపోకలు సాగించనున్నాయి. దీంతో ఆయా జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు జేబీఎస్​కు రావాలని అధికారులు సూచించారు. వరంగల్​, హన్మకొండ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్​ క్రాస్​ రోడ్డు నుంచి, నల్గొండ, సూర్యాపేట, విజయవాడ వెళ్లే బస్సులు ఎల్బీ నగర్​ నుంచి నడుస్తున్నాయి. మహబూబ్​నగర్​, కర్నూల్​, బెంగళూరు వైపు వెళ్లే బస్సులు ఆరాంఘర్​ నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి, సహకరించాలని అధికారులు కోరారు. ఇతర వివ‌రాల‌కు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంట‌ర్ నంబ‌ర్లు 040-69440000, 040-23450033 సంప్ర‌దించాల‌ని ఆర్టీసీ అధికారులు సూచించారు.

Hyderabad Floods | నార్సింగి సర్వీస్​ రోడ్డు మూసివేత

హిమాయత్​ సాగర్​ గేట్లు ఎత్తడంతో పది వేల క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. నార్సింగి-హిమాయత్‌సాగర్ సర్వీస్ రోడ్డుపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు వాహనదారులకు సూచించారు. మరోవైపు గండిపేట (ఉస్మాన్​సాగర్​)కు భారీగా వస్తుండటంతో అధికారులు పది గేట్లు ఎత్తారు.

Hyderabad Floods | సీఎం రేవంత్​రెడ్డి సమీక్ష

మూసీ నది(Musi River)కి వరద పోటెత్తడంతో సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాన్నారు. కాగా అధికారులు ఇప్పటికే దాదాపు వెయ్యి మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.

Must Read
Related News