అక్షరటుడే, లింగంపేట్ : Lingampet | మండలంలోని అయిలాపూర్ గ్రామంలో హనుమాన్ ఆలయం (Hanuman Temple) పునఃప్రతిష్టాపన ఉత్సవాలు ఆదివారం నిర్వహించారు. ఈ మేరకు ఆలయ నిర్మాణానికి జాగృతి యువజన విభాగం (Jagruti Youth Department) కన్వీనర్ సంపత్గౌడ్ రూ.లక్ష విరాళం అందజేశారు. ఆదివారం ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) చేతులమీదుగా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఆలయాల అభివృద్ధికి పాటుపడుతున్న సంపత్గౌడ్ను అభినందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చిన్న మల్లయ్య, రాములు, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్, శంకర్, బాలయ్య, గణేష్, తదితరులు పాల్గొన్నారు.
