ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Tirumala | శ్రీవారికి భారీ వెండి అఖండాల విరాళం

    Tirumala | శ్రీవారికి భారీ వెండి అఖండాల విరాళం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Tirumala | తిరుమల(tirumala)లో కొలువుదీరిన కలియుగ దైవం వేంకటేశ్వర స్వామికి దాదాపు 300 ఏళ్ల తర్వాత అఖండాలను విరాళం ఇచ్చారు. తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత mysore rajamatha ప్రమోదా దేవి pramoda devi రెండు భారీ వెండి అఖండాల(అఖండ దీపాలు)ను సోమవారం విరాళంగా అందించారు. ఇవి గర్భగుడిలో వెలిగించే సంప్రదాయ దీపాలు. సుమారు 300 సంవత్సరాల క్రితం అప్పటి మైసూరు మహారాజు mysore king ఇలాంటి దీపాలను ఆలయానికి విరాళం ఇచ్చినట్లు చరిత్రలో ఉంది. ఇప్పుడు మళ్లీ మైసూరు రాజమాత వాటిని సమర్పించడం విశేషం. ఒక్కో వెండి అఖండం సుమారు 50 కిలోల బరువుంటుంది. తిరుమలలోని రంగనాయకుల మండపం Ranganayakula Mandapamలో ఆమె ఈ భారీ వెండి అఖండాలను టీటీడీ TTD కి అందించారు. కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.

    More like this

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...