HomeతెలంగాణTelangana University | తెయూ అధ్యాపకురాలు గోల్డి బల్బీర్​కౌర్​కు డాక్టరేట్​

Telangana University | తెయూ అధ్యాపకురాలు గోల్డి బల్బీర్​కౌర్​కు డాక్టరేట్​

- Advertisement -

అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ యూనివర్సిటీలో ఆంగ్ల విభాగంలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న గోల్డి బల్బీర్​ కౌర్ డాక్టరేట్​ సాధించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో (Kakatiya University) రిటైర్డ్​ ప్రొఫెసర్​ వి.శ్రీనివాస్​ పర్యవేక్షణలో ‘ద ఇమేజ్ ఆఫ్ న్యూ వుమెన్ స్టడీ ఆఫ్ శోభాడే సెలక్ట్ నావెల్స్’ అనే అంశంపై ఆమె పరిశోధన చేశారు.

వర్సిటీలో మంగళవారం జరిగిన మౌఖిక పరీక్షకు ఎక్స్​టర్నల్​ ఎగ్జామినర్​గా ఇంగ్లిష్​ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీకి (Foreign Languages University) చెందిన ప్రొఫెసర్ జి.తిరుపతి కుమార్ ఆన్​లైన్​లో హాజరయ్యారు. పరిశోధకురాలు గోల్ది బల్బీర్ పరిశోధించి విశ్వవిద్యాలయానికి సమర్పించిన సిద్ధాంత గ్రంథంలో అభ్యుదయ స్త్రీవాదం, లింగ సమానత్వం, కుటుంబ ఆర్థిక రాజకీయ స్వావలంబనపై సమగ్రంగా విశ్లేషణ ఉందని ఆయన పేర్కొన్నారు. ఆమె పరిశోధన సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని పరిశోధకురాలిని ఆయన అభినందించారు. ఈ మౌఖిక పరీక్షకు డీన్ ప్రొఫెసర్ లావణ్య, విభాగాధిపతి డాక్టర్ కేవీ రమణా చారి, ఛైర్​పర్సన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ పి.సమత, ఎల్ జోత్స్న, ఎన్ స్వామి రావు, విద్యార్థులు పాల్గొన్నారు.