HomeతెలంగాణBodhan | నేనెవరో తెలుసా.. నీరు రావడం లేదని ఫోన్ చేసిన వ్యక్తిపై ఏఈ ఆగ్రహం

Bodhan | నేనెవరో తెలుసా.. నీరు రావడం లేదని ఫోన్ చేసిన వ్యక్తిపై ఏఈ ఆగ్రహం

- Advertisement -

అక్షరటుడే, బోధన్​ : Bodhan | ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన ఓ అధికారి(Officer) నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. నీళ్లు రావడం లేదని ఫోన్ చేస్తే నాకేందుకు చేశావని ఓ వ్యక్తిని బెదించాడు. బోధన్​ పట్టణంలోని శక్కర్​నగర్(Shakkarnagar)​లో రెండు రోజులుగా నీరు రావడం లేదు. దీంతో స్థానికంగా ఉండే ఓ వ్యక్తి తమ సమస్య చెప్పుకోవడానికి మున్సిపల్​ ఏఈ(Municipal AE) శ్రీనివాస్​కు ఫోన్​ చేశాడు. దీంతో సదరు అధికారి పొంతన లేని సమాధానం చెప్పాడు. అంతేగాకుండా తనకు ఎందుకు ఫోన్​ చేశావని ప్రశ్నించడం గమనార్హం. ‘‘నేను ఎవరో తెలుసా’’ అంటూ.. ఫోన్​ చేసిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన అధికారే ఇలా మాట్లాడితే ఎలా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు ఇంకా ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు.