ePaper
More
    HomeతెలంగాణBodhan | నేనెవరో తెలుసా.. నీరు రావడం లేదని ఫోన్ చేసిన వ్యక్తిపై ఏఈ ఆగ్రహం

    Bodhan | నేనెవరో తెలుసా.. నీరు రావడం లేదని ఫోన్ చేసిన వ్యక్తిపై ఏఈ ఆగ్రహం

    Published on

    అక్షరటుడే, బోధన్​ : Bodhan | ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన ఓ అధికారి(Officer) నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. నీళ్లు రావడం లేదని ఫోన్ చేస్తే నాకేందుకు చేశావని ఓ వ్యక్తిని బెదించాడు. బోధన్​ పట్టణంలోని శక్కర్​నగర్(Shakkarnagar)​లో రెండు రోజులుగా నీరు రావడం లేదు. దీంతో స్థానికంగా ఉండే ఓ వ్యక్తి తమ సమస్య చెప్పుకోవడానికి మున్సిపల్​ ఏఈ(Municipal AE) శ్రీనివాస్​కు ఫోన్​ చేశాడు. దీంతో సదరు అధికారి పొంతన లేని సమాధానం చెప్పాడు. అంతేగాకుండా తనకు ఎందుకు ఫోన్​ చేశావని ప్రశ్నించడం గమనార్హం. ‘‘నేను ఎవరో తెలుసా’’ అంటూ.. ఫోన్​ చేసిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన అధికారే ఇలా మాట్లాడితే ఎలా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు ఇంకా ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు.

    More like this

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...

    Ramareddy mandal | యూరియా కోసం రైతుల బారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Ramareddy mandal | రామారెడ్డి మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం (society office) వద్ద యూరియా...