ePaper
More
    HomeజాతీయంVande Bharat Train | నాందేడ్ నుంచి ముంబైకి వందేభారత్.. ఎన్ని గంటల్లో వెళ్తారో తెలుసా..!

    Vande Bharat Train | నాందేడ్ నుంచి ముంబైకి వందేభారత్.. ఎన్ని గంటల్లో వెళ్తారో తెలుసా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vande Bharat Train | ప్రయాణికులకు రైల్వే శాఖ(Railway Department) గుడ్​న్యూస్​ చెప్పింది. ముంబై నుంచి జాల్నా మధ్య నడుస్తున్న వందే భారత్​ రైలును నాందేడ్​ వరకు పొడిగించింది.

    ఆధునిక హంగులతో వేగవంతమైన ప్రయాణం కోసం కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైళ్లను (Vande Bharat Trains) ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు మార్గాల్లో వందే భారత్​ ట్రైన్లు నడుస్తున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కేంద్రం మరిన్ని వందే భారత్​ రైళ్లను ప్రవేశ పెట్టాలని చూస్తోంది. అలాగే ప్రస్తుతం నడుస్తున్న పలు రైళ్లను కూడా ఇతర స్టేషన్లకు పొడిగిస్తోంది. ఇందులో భాగంగా ముంబై(Mumbai)లోని ఛత్రపతి శివాజీ టర్మినల్​ నుంచి జాల్నా మధ్య నడుస్తున్న రైలును నాందేడ్(Nanded)​ వరకు పొడిగించింది.

    READ ALSO  Vice President Dhankhar | భాష మ‌న‌ల్ని విభ‌జించ‌లేదు.. ఏకం చేస్తుంద‌న్న ఉప రాష్ట్ర‌ప‌తి ధ‌న్‌ఖ‌డ్‌

    Vande Bharat Train | పది స్టేషన్లు.. 9:25 గంటల ప్రయాణం

    ప్రస్తుతం ఉన్న ఛత్రపతి శివాజీ మహరాజ్​ టర్మినల్ (Chhatrapati Shivaji Maharaj Terminal)​– జాల్నా వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ను ఛత్రపతి శివాజీ మహరాజ్​ టర్మినల్–హుజుర్​ సాహేబ్​ నాందేడ్​ వందే భారత్​ ఎక్స్​ప్రెస్​గా మార్చారు. గతంలో ఈ ట్రెయిన్​ ముంబై నుంచి జల్నాకు 6 గంటల 50 నిమిషాల్లో వెళ్లేది. ప్రస్తుతం ముంబై నుంచి నాందేడ్​కు 9 గంటల 25 నిమిషాల్లో చేరుకోనుంది. మధ్యలో దాదర్​, థానే, కల్యాణ్​, నాసిక్​ రోడ్డు, మన్మాడ్​, ఔరంగబాద్​, జల్నా, పర్బనీ స్టేషన్​లలో ఆగనుంది.

    నాందేడ్​ నుంచి ముంబై మార్గంలో నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో రైల్వేశాఖ వందే భారత్​ రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల నుంచి వీటికి ఆదరణ వస్తుండటంతో తాజాగా జాల్నా వరకు నడుస్తున్న వందే భారత్​ రైలును నాందేడ్ వరకు పొడిగించింది.

    READ ALSO  Nimisha Priya | నిమిష‌ప్రియ ఉరిశిక్ష ర‌ద్దు.. ప్ర‌క‌టించిన కేఏ పాల్‌

    Vande Bharat Train | నిజామాబాద్​ వరకు పొడిగిస్తే మేలు

    ఉమ్మడి నిజామాబాద్(Nizamabad), కరీంనగర్ (Karim Nagar)​ జిల్లాల నుంచి నిత్యం ముంb వందలాది మంది రాకపోలకు సాగిస్తారు. సికింద్రాబాద్​ నుంచి నాందేడ్​, ముంబై మధ్య నడిచే రైళ్లలో నిత్యం రద్దీ అధికంగా ఉంటుంది. కరీంనగర్​, నిజామాబాద్​ జిల్లాలకు చెందిన ఎంతో మంది గల్ఫ్​ దేశాలకు వలస వెళ్తారు. వీరు కూడా ముంబై మీదుగా రాకపోకలు సాగిస్తారు. అలాగే ముంబైలో ఎంతో మంది స్థిరపడ్డారు. ఈ క్రమంలో వందే భారత్​ రైలును నిజామాబాద్​ వరకు పొడిగిస్తే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది.

    ప్రస్తుతం ముంబైకి రైళ్లు అందుబాటులో ఉన్నా.. ప్రైవేట్​ బస్సుల్లో చాలా మంది వెళ్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో ప్రైవేట్​ బస్సులు నిజామాబాద్​ నుంచి ముంబైకి రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో వందేభారత్​ను నిజామాబాద్​ వరకు పొడిగిస్తే ప్రయాణికులకు మేలు కలుగనుంది.

    READ ALSO  Railway | రైలు ప్రయాణికులకు అలర్ట్​.. పెద్దపల్లి జంక్షన్​లో బైపాస్​ రైల్వే మార్గం నిర్మాణం.. పలు రైళ్లు రద్దు..

    Latest articles

    SP Rajesh Chandra | భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి

    అక్షరటుడే, గాంధారి: SP Rajesh Chandra | భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా...

    Engineering Colleges | ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంజినీరింగ్​ కాలేజీల్లో ఫీజుల నిర్ధారణకు కమిటీ ఏర్పాటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Engineering Colleges | ఇంజినీరింగ్ (Engineering)​, ఇతర వృత్తి విద్యా కాలేజీల్లో ఫీజుల నిర్ధారణకు...

    Kamareddy congress | దళిత సీఎం మాట మార్చిన ఘనత బీఆర్​ఎస్​ది..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy congress | తెలంగాణ రాష్ట్రం వస్తే దళితున్ని సీఎం చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయిన...

    Education Department | పైసలిస్తేనే పర్మిషన్​..!

    అక్షరటుడే, ఇందూరు : Education Department | జిల్లా విద్యాశాఖలో (district education department) పలువురు సిబ్బంది తీరుపై...

    More like this

    SP Rajesh Chandra | భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి

    అక్షరటుడే, గాంధారి: SP Rajesh Chandra | భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా...

    Engineering Colleges | ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంజినీరింగ్​ కాలేజీల్లో ఫీజుల నిర్ధారణకు కమిటీ ఏర్పాటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Engineering Colleges | ఇంజినీరింగ్ (Engineering)​, ఇతర వృత్తి విద్యా కాలేజీల్లో ఫీజుల నిర్ధారణకు...

    Kamareddy congress | దళిత సీఎం మాట మార్చిన ఘనత బీఆర్​ఎస్​ది..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy congress | తెలంగాణ రాష్ట్రం వస్తే దళితున్ని సీఎం చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయిన...