ePaper
More
    HomeజాతీయంBrahmos Missile | పాక్​పై భారత్​ ఎన్ని బ్రహ్మోస్​ క్షిపణులు ప్రయోగించిందో తెలుసా?

    Brahmos Missile | పాక్​పై భారత్​ ఎన్ని బ్రహ్మోస్​ క్షిపణులు ప్రయోగించిందో తెలుసా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : జమ్మూకశ్మీర్​లోని పహల్గామ్​ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత భారత్​, పాకిస్తాన్​ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఏప్రిల్​ 22న పహల్గామ్​ ఉగ్రదాడి జరగ్గా.. మే 7న భారత్​ ఆపరేషన్​ సిందూర్ (Operation Sindoor)​ చేపట్టింది. పీవోకే, పాక్​లోని తొమ్మిది ఉగ్రస్థావరాలను భారత వైమానిక దళం ధ్వంసం చేసింది. ఈ దాడిలో వంద మంది వరకు టెర్రరిస్టులు హతం అయ్యారు.

    భారత్​ ఆపరేషన్​ సిందూర్​తో బిత్తరపోయిన పాక్​.. ప్రతీకార దాడులకు తెగబడింది. డ్రోన్లు, మిసైళ్లు, యుద్ధ విమానాలతో భారత్​పై దాడి చేసింది. అయితే భారత గగనతల రక్షణ వ్యవస్థ పాక్​ దాడులను సమర్థవంతంగా అడ్డుకుంది. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్​–400 వ్యవస్థ (S-400 System) పాక్​ ప్రయోగించిన క్షిపణులను మధ్యలోనే కూల్చివేసింది.

    Brahmos Missile | ఆరు పాక్​ విమానాల కూల్చివేత

    దాడికి యత్నించిన ఆరు పాక్​ విమానాలను భారత్​ కూల్చి వేసింది. ఎస్​ –400 రక్షణ వ్యవస్థ మూడు విమానాలను కూల్చి వేసినట్లు సమాచారం. అలాగే భారత వైమానిక దళం కూడా పాక్​ విమానాలను కూల్చేసినట్లు తెలిసింది. అలాగే పాక్​లోని నాలుగు రాడార్​ (Radar) వ్యవస్థలను ఇండియన్​ ఎయిర్​ ఫోర్స్ (IAF)​ ధ్వంసం చేసింది.

    Brahmos Missile | 19 బ్రహ్మోస్​ క్షిపణులతో దాడి

    పాకిస్తాన్​ దాడులను తిప్పి కొట్టిన భారత్​ మే 10న తన ఉగ్రరూపాన్ని చూపెట్టింది. దాయాది దేశంలోని ఎయిర్​ బేస్ (Air Base)​లే లక్ష్యంగా 19 బ్రహ్మోస్​ మిసైళ్ల (Brahmos Missile)ను ప్రయోగించింది. మొత్తం 11 వైమానిక స్థావరాలపై భారత్​ దాడులు చేసింది. దీంతో పాక్​ ఎయిర్​ బేస్​లకు తీవ్ర నష్టం వాటిల్లింది. IAF క్షిపణి దాడిలో పాక్​ ఎయిర్​బేస్​లోని రెండు F-16 యుద్ధ విమానాలు పాక్షికంగా తిన్నట్లు సమాచారం. భారత్​ పాక్​పై బ్రహ్మోస్​తో పాటు ఫ్రెంచ్​ SCALP సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ సందర్భంగా పాక్​ ప్రయోగించిన క్షిపణులను భారత్​ అడ్డుకుంది. అనంతరం రెండు దేశాలు కాల్పుల విరమణ (Ceasefire)కు అంగీకరించాయి.

    More like this

    BJP Yellareddy | నిత్యావసరాలపై జీఎస్టీ తగ్గించడం భేష్​.. బీజేపీ నాయకులు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : BJP Yellareddy | కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల వస్తువులపై జీఎస్టీని తగ్గించడంపై బీజేపీ...

    GPO | కొత్త జీపీఓలకు కౌన్సెలింగ్

    అక్షరటుడే, ఇందూరు: GPO | రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రామపంచాయతీ అధికారుల (Gram Panchayat Officers) నియామకాలు చేపట్టింది....

    Malayalam Actress | మల్లెపూలు పెట్టుకున్నందుకు లక్ష రూపాయల ఫైన్: మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టులో న‌టికి షాక్!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Malayalam Actress | ప్రముఖ మలయాళ నటి నవ్యా నాయర్‌కి మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టులో ఊహించని...