- Advertisement -
Homeఆంధప్రదేశ్AP High Court | గ్రూప్​–2 నియామకాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు : ఏపీ హైకోర్టు

AP High Court | గ్రూప్​–2 నియామకాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు : ఏపీ హైకోర్టు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : AP High Court | ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు గ్రూప్​–2 నియామకాలపై (Group-2 appointments) ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో 905 గ్రూప్​–2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ మేరకు ప్రిలిమ్స్​, మెయిన్స్​ పరీక్షలు (prelims and mains examinations) నిర్వహించింది. ఫిబ్రవరి 23న మెయిన్స్​ పరీక్షలు జరగ్గా.. ఏప్రిల్ 5న ఫలితాలు విడుదల అయ్యాయి.

- Advertisement -

AP High Court | రద్దు చేయాలని కోర్టుకు..

గ్రూప్​–2 మెయిన్స్​ ఫలితాలు (Group-2 mains results) విడుదల అవడంతో కమిషన్​ ధ్రువపత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. సాధారణ, స్పోర్ట్స్​ కోటా కింద మొత్తం 2,517 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే ఎంపిక కానీ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్‌-2 పరీక్షల నోటిఫికేషన్‌ రద్దు చేయాలని కోరారు.

అభ్యర్థులు, ఏపీపీఎస్సీ వాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వ్​ చేసింది. అప్పటి వరకు గ్రూప్​–2 నియామకాలపై ముందకు వెళ్లొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎంపికైన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కాగా తెలంగాణలో సైతం ఇటీవల గ్రూప్​–1 ఫలితాలు, ర్యాంకులను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News