అక్షరటుడే, ఇందూరు: London | లండన్లో లేబర్ ఏషియన్ సొసైటీ (Labor Asian Society) ఆధ్వర్యంలో బుధవారం దీపావళి వేడుకలు నిర్వహించారు.
లండన్ తెలుగు కమిటీ అధ్యక్షుడు నరేశ్ మేడిశెట్టి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా భారతదేశానికి సంబంధించిన ప్రముఖులను ఈ వేడులకు ఆహ్వానించారు. ఎంపీ కిరిత్ ఎంట్విస్ట్లే, మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం తరపున సంగీత్ నాటక్ అకాడమీ ఛైర్మన్ అలేఖ్య పుంజల కూడా దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
