అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | సీఎం సహాయ నిధి (CM Relief Fund) ద్వారా లబ్ధిదారులకు గురువారం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 64 మందికి రూ.22.28 లక్షల చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు దరఖాస్తు చేసుకున్న మొత్తంలో 15 నుంచి 20 శాతం మాత్రమే చెల్లిస్తుందన్నారు. కనీసం 50శాతం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.