HomeతెలంగాణPCC Chief Mahesh Goud | మంత్రుల మధ్య వివాదం మా కుటుంబ సమస్య :...

PCC Chief Mahesh Goud | మంత్రుల మధ్య వివాదం మా కుటుంబ సమస్య : పీసీసీ చీఫ్​ మహేష్‌గౌడ్

PCC Chief Mahesh Goud | మంత్రుల మధ్య తలెత్తిన వివాదం తమ కుటుంబ సమస్య అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్​ గౌడ్​ అన్నారు. తాము ఆ సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PCC Chief Mahesh Goud | మంత్రుల మధ్య వివాదంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​ స్పందించారు. అది తమ కుటుంబ సమస్య అని ఆయన పేర్కొన్నారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి (Minister Ponguleti) తీరుపై ఇటీవల కొండా సురేఖ భర్త మురళి (Konda Murali) అధిష్టానానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మేడారం (Medaram)లో దేవాదాయ శాఖ పరిధిలో చేపట్టే పనులను ఆయన తన కంపెనీకి ఇచ్చుకున్నారని కొండా మురళి ఆరోపించారు. ఈ వ్యవహారంపై మంత్రులు కొండా సురేఖ (Konda Surekha), సీతక్క (Seethakka) సైతం అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో మహేశ్​ గౌడ్​ ఆదివారం స్పందించారు.

PCC Chief Mahesh Goud | సీఎంతో మాట్లాడా..

మంత్రులు సీతక్క, కొండా సురేఖ కొన్ని సమస్యలు చెప్పారని మహేశ్​ గౌడ్​ తెలిపారు. మంత్రుల ఎపిసోడ్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy)తో మాట్లాడినట్లు ఆయన పేర్కొన్నారు. మంత్రుల మధ్య తలెత్తింది పెద్ద సమస్య కాదన్నారు. సమాచార లోపంతో ఏర్పడిన సమస్య మాత్రమే అని స్పష్టం చేశారు. తాను, సీఎం రేవంత్​రెడ్డి కూర్చుని సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేతో ఎవరైనా సమస్య చెప్పుకోవచ్చని ఆయన అన్నారు.

PCC Chief Mahesh Goud | రేపు ఢిల్లీకి..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు (BC Reservations) అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవోపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేయనుంది. ఈ క్రమంలో సోమవారం తనతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్​, వాకిటి శ్రీహరి ఢిల్లీ వస్తున్నట్లు మహేశ్​ గౌడ్​ తెలిపారు. బీజేపీ బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తుందని ఆయన విమర్శించారు. గవర్నర్‌ దగ్గర బిల్లులు పెండింగ్‌లో పెట్టి, తమ నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సంఘాల ఆందోళనకు కాంగ్రెస్​ మద్దతు ఇస్తుందన్నారు.