ePaper
More
    Homeక్రైంChepa Prasadam | చేప ప్రసాదం పంపిణీలో అపశ్రుతి

    Chepa Prasadam | చేప ప్రసాదం పంపిణీలో అపశ్రుతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chepa Prasadam | హైదరాబాద్(Hyderabad)​లోని నాంపల్లి ఎగ్జిబిషన్​ గ్రౌండ్ (Nampally Exhibition Ground)​లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. మృగశిర కార్తె సందర్భంగా ఏటా బత్తిని గౌడ్​ కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. దీనిని తీసుకుంటే ఆస్తమా, ఉబ్బసం, శ్వాస సంబంధ వ్యాధులు తగ్గుతాయని ప్రజల నమ్మకం. దీంతో ఏటా లక్షలాది మంది చేప ప్రసాదం కోసం వస్తారు.

    మిరుగు సందర్భంగా ఆదివారం ఎగ్జిబిషన్​ గ్రౌండ్​లో చేప ప్రసాదం (Chepa Prasadam) పంపిణీ చేపట్టారు. ఈ క్రమంలో మెదక్ (Medak) జిల్లాకి చెందిన సత్యనారాయణ (75) అనే వృద్ధుడికి క్యూలైన్​లో ఉండగా గుండెపోటు వచ్చింది. స్పృహ తప్పి పడిపోయిన వృద్ధుడికి సీపీఆర్​ చేసినా ఫలితం లేకుండా పోయింది. సత్యనారాయణ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

    గతేడాది సైతం క్యూలైన్​లో సొమ్మసిల్లి పడిపోయి ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఈ సారి అధికారులు, నిర్వాహకులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. 42 క్యూ లైన్​లలో కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రసాదం పంపిణీ చేపట్టారు. కాగా.. సోమవారం ఉదయం 9 గంటలకు వరకు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు.

    More like this

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...