ePaper
More
    HomeతెలంగాణKonda Surekha | వరంగల్​ కాంగ్రెస్​లో మళ్లీ బయటపడ్డ విభేదాలు

    Konda Surekha | వరంగల్​ కాంగ్రెస్​లో మళ్లీ బయటపడ్డ విభేదాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Konda Surekha | వరంగల్​ కాంగ్రెస్​లో (Warangal Congress)​ విభేదాలు చల్లారడం లేదు. గత కొంతకాలంగా మంత్రి కొండా సురేఖ భర్త మురళికి (Konda Murali) ఉమ్మడి జిల్లా కాంగ్రెస్​ ఎమ్మెల్యేలకు పడటం లేదు.

    తాజాగా మరోసారి రాజీవ్​గాంధీ జయంతి సందర్భంగా వర్గపోరు బయటపడింది. మంత్రి కొండా సురేఖ రాకముందే కాంగ్రెస్​ నేతలు రాజీవ్​ గాంధీ (Rajiv Gandhi) విగ్రహానికి నివాళి అర్పించారు. దీనిపై మంత్రి సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    కొండా మురళి స్టేషన్ ఘన్​పూర్​ కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే ​రేవురి ప్రకాశ్​రెడ్డిపై గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య పోరు నడుస్తోంది. మంత్రి సురేఖ సైతం వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డిపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు ఏకమయ్యారు. కొండా దంపతులకు వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.

    Konda Surekha | రాజీకి ప్రయత్నించినా..

    వరంగల్​ కాంగ్రెస్​లో వర్గపోరుపై పీసీసీ (PCC) క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశం నిర్వహించింది. నేతల మధ్య రాజీ కుదర్చడానికి ఛైర్మన్​ మల్లు రవి (Mallu Ravi) ప్రయత్నాలు చేశారు. కొండా మురళికి సర్ది చెప్పారు. ఈ మేరకు స్థానిక ఎన్నికల్లో (Local Body Elections) కలిసి పని చేస్తామని కొండా మురళి స్పష్టం చేశారు. అంతేగాకుండా వరంగల్​ పంచాయితీ పరిష్కారం కోసం కమిటీ వేస్తామని మల్లు రవి తెలిపారు. అయినా నేతల మధ్య మాత్రం సఖ్యత కుదరడం లేదు.

    Konda Surekha | వేర్వేరుగా రాజీవ్​గాంధీ జయంతి

    రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్​ శ్రేణులు బుధవారం రాజీవ్​గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించాయి. వరంగల్​లో నిర్వహించిన వేడుకలకు మంత్రి సురేఖ హాజరు కావాల్సి ఉంది. అయితే ఆమె రాకముందే పలువురు కాంగ్రెస్​ నేతలు నివాళి అర్పించారు. ఎర్రబెల్లి స్వర్ణ, బస్వారాజు సారయ్య, నాగరాజు మంత్రి రాకముందే నివాళి అర్పించి వెళ్లిపోయారు. దీంతో కొండా సురేఖ వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రాకముందే పూలమాల వేయడం.. వారి విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ మండి పడ్డారు.

    Latest articles

    All India Kisan Congress | కామారెడ్డి కాంగ్రెస్​ నాయకుడికి పాట్నా ఓటర్ అధికార్ ర్యాలీ బాధ్యతలు

    అక్షరటుడే, కామారెడ్డి: All India Kisan Congress | కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి (Devunipally) గ్రామానికి చెందిన...

    Stock Markets | ఐదో రోజూ లాభాలే.. 25 వేలకు పైన నిలదొక్కుకున్న నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | జీఎస్టీ రిఫార్మ్స్‌పై ఆశావహ దృక్పథంతో ఇన్వెస్టర్లు పాజిటివ్‌గా నిలుస్తున్నారు. దీంతో...

    Banswada | ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు (Teacher) కీచకులుగా మారుతున్నారు. అభంశుభం తెలియని విద్యార్థినులపై...

    Karnataka | సైలెంట్‌గా ఉన్న చిరుత‌ని రెచ్చ‌గొటారు.. చివ‌రికి ఏమైంది.. వైర‌ల్ వీడియో

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka | ఇటీవలకాలంలో సఫారీ టూర్‌లకు వెళ్లే వారి సంఖ్య క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతోంది. అడవుల్లో...

    More like this

    All India Kisan Congress | కామారెడ్డి కాంగ్రెస్​ నాయకుడికి పాట్నా ఓటర్ అధికార్ ర్యాలీ బాధ్యతలు

    అక్షరటుడే, కామారెడ్డి: All India Kisan Congress | కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి (Devunipally) గ్రామానికి చెందిన...

    Stock Markets | ఐదో రోజూ లాభాలే.. 25 వేలకు పైన నిలదొక్కుకున్న నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | జీఎస్టీ రిఫార్మ్స్‌పై ఆశావహ దృక్పథంతో ఇన్వెస్టర్లు పాజిటివ్‌గా నిలుస్తున్నారు. దీంతో...

    Banswada | ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు (Teacher) కీచకులుగా మారుతున్నారు. అభంశుభం తెలియని విద్యార్థినులపై...