HomeతెలంగాణKonda Surekha | వరంగల్​ కాంగ్రెస్​లో మళ్లీ బయటపడ్డ విభేదాలు

Konda Surekha | వరంగల్​ కాంగ్రెస్​లో మళ్లీ బయటపడ్డ విభేదాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Konda Surekha | వరంగల్​ కాంగ్రెస్​లో (Warangal Congress)​ విభేదాలు చల్లారడం లేదు. గత కొంతకాలంగా మంత్రి కొండా సురేఖ భర్త మురళికి (Konda Murali) ఉమ్మడి జిల్లా కాంగ్రెస్​ ఎమ్మెల్యేలకు పడటం లేదు.

తాజాగా మరోసారి రాజీవ్​గాంధీ జయంతి సందర్భంగా వర్గపోరు బయటపడింది. మంత్రి కొండా సురేఖ రాకముందే కాంగ్రెస్​ నేతలు రాజీవ్​ గాంధీ (Rajiv Gandhi) విగ్రహానికి నివాళి అర్పించారు. దీనిపై మంత్రి సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొండా మురళి స్టేషన్ ఘన్​పూర్​ కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే ​రేవురి ప్రకాశ్​రెడ్డిపై గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య పోరు నడుస్తోంది. మంత్రి సురేఖ సైతం వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డిపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు ఏకమయ్యారు. కొండా దంపతులకు వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.

Konda Surekha | రాజీకి ప్రయత్నించినా..

వరంగల్​ కాంగ్రెస్​లో వర్గపోరుపై పీసీసీ (PCC) క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశం నిర్వహించింది. నేతల మధ్య రాజీ కుదర్చడానికి ఛైర్మన్​ మల్లు రవి (Mallu Ravi) ప్రయత్నాలు చేశారు. కొండా మురళికి సర్ది చెప్పారు. ఈ మేరకు స్థానిక ఎన్నికల్లో (Local Body Elections) కలిసి పని చేస్తామని కొండా మురళి స్పష్టం చేశారు. అంతేగాకుండా వరంగల్​ పంచాయితీ పరిష్కారం కోసం కమిటీ వేస్తామని మల్లు రవి తెలిపారు. అయినా నేతల మధ్య మాత్రం సఖ్యత కుదరడం లేదు.

Konda Surekha | వేర్వేరుగా రాజీవ్​గాంధీ జయంతి

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్​ శ్రేణులు బుధవారం రాజీవ్​గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించాయి. వరంగల్​లో నిర్వహించిన వేడుకలకు మంత్రి సురేఖ హాజరు కావాల్సి ఉంది. అయితే ఆమె రాకముందే పలువురు కాంగ్రెస్​ నేతలు నివాళి అర్పించారు. ఎర్రబెల్లి స్వర్ణ, బస్వారాజు సారయ్య, నాగరాజు మంత్రి రాకముందే నివాళి అర్పించి వెళ్లిపోయారు. దీంతో కొండా సురేఖ వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రాకముందే పూలమాల వేయడం.. వారి విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ మండి పడ్డారు.