ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad city | బ్రెయిన్ స్ట్రోక్​తో చనిపోయి.. ఇద్దరికి నేత్రదానం చేసి..!

    Nizamabad city | బ్రెయిన్ స్ట్రోక్​తో చనిపోయి.. ఇద్దరికి నేత్రదానం చేసి..!

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad city | ఓ వృద్ధురాలు బ్రెయిన్ స్ట్రోక్​తో చనిపోయినా.. ఇద్దరికి నేత్రదానం చేసింది. ఈ ఘటన నగరంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని శ్రీనగర్ కాలనీకి (Srinagar Colony) చెందిన కరిపే సావిత్రి బాయి అనే వృద్ధురాలు బ్రెయిన్ స్ట్రోక్​తో (Brain stroke) మృతి చెందారు.

    దీంతో విషయం తెలిసిన లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూరు సభ్యులు ఆమె కుమారుడైన బీసీ ఉద్యోగుల సంఘం (BC Employees Association) జిల్లా అధ్యక్షుడు కరిపే రవీందర్​తో పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నేత్రదానంపై (Eye donation) అవగాహన కల్పించడంతో వారు అంగీకరించారు.

    దీంతో మృతురాలి నుంచి సేకరించిన నేత్రాలను లయన్స్ ఐ హాస్పిటల్​కు (Lions Eye Hospital) అందజేసినట్లు జిల్లా లయన్స్ అదనపు కార్యదర్శి లక్ష్మీ నారాయణ తెలిపారు. ఆమె నేత్ర దానంతో ఇద్దరికి కంటి వెలుగు వచ్చిందని, ఈ మేరకు సహరించిన కరిపే రవీందర్ కుటుంబ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో కరిపే గోవర్ధన్, లింగోజీ, డా తేజస్వి, డా రాజేష్, అక్షయ్ కుమార్, పుష్ప, విజయలక్ష్మి పాల్గొన్నారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...