Homeజిల్లాలునిజామాబాద్​DICCI | దళిత యువత వ్యాపారంలో రాణించాలి

DICCI | దళిత యువత వ్యాపారంలో రాణించాలి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: | దళితులు రాజకీయాలతో పాటు వ్యాపారంలోనూ రాణించాలని పద్మశ్రీ నర్రా రవికుమార్ (Narra Ravikumar) అన్నారు. ప్రభుదా భారత్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (Prabhuda Bharat International Foundation), డీఐసీసీఐ సంయుక్త ఆధ్వర్యంలో కృష్ణ హోటల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితులు ఉద్యోగులుగా కాకుండా ఉద్యోగాలను సృష్టించే వారీగా ఎదగాలన్నారు. పన్నులు చెల్లించే వారీగా మారాలన్నారు. రాజకీయాలకు అతీతంగా డీఐసీసీఐ పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పీబీఐఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్యాం, బ్లూ ఫిన్ సొల్యూషన్స్ ఎండీ రాజేందర్​కుమార్​, డీఐసీసీఐ రాష్ట్ర కో-ఆర్డినేటర్ నారాయణ, అగ్రికల్చర్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ గంగాధర్, టీజీవో అధ్యక్షుడు కిషన్, డీఐసీసీఐ జిల్లా కో-ఆర్డినేటర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News