అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ఆంధ్రప్రదేశ్లోని (Andhra Pradesh) ‘సాక్షి’ పత్రిక (Sakshi) కార్యాలయాలపై జరిగిన దాడులను నిరసిస్తూ శుక్రవారం బాన్సువాడ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. బాన్సువాడ ప్రెస్క్లబ్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందని, వాస్తవాలు వెలుగులోకి తీసుకువస్తున్న ‘సాక్షి’ పత్రిక గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందన్నారు.
‘సాక్షి’ ఎడిటర్తో పాటు జర్నలిస్టులను ఇబ్బందులకు గురిచేసే చర్యలను వెంటనే నిలిపివేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, సీపీఎం, సీపీఐ, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.