అక్షరటుడే, ఇందూరు: Dharmapuri Sanjay Post | మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్కు (Dharmapuri Sanjay) గౌరవప్రదమైన పదవి ఇచ్చి మున్నూరుకాపుల (Munnurukapu Sangham) అభ్యున్నతికి పాటుపడాలని సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో (Gandhi Bhavan Hyderabad) ప్రతినిధికి వినతిపత్రం అందజేశారు.
Dharmapuri Sanjay Post | 12ఏళ్లుగా సరైన ప్రాతినిథ్యం లేక..
ఈ సందర్భంగా జిల్లా మున్నూరుకాపు సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. 12ఏళ్లుగా జిల్లాలో మున్నూరుకాపులకు సరైన ప్రాతినిథ్యం లేదన్నారు. జిల్లాలో 4లక్షలకు పైగా మున్నూరుకాపు ఓటర్ల ఉన్నప్పటికీ రాజకీయంగా ఎలాంటి గుర్తింపు లేదని వాపోయారు. కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ అని ప్రస్తుతం ప్రజాప్రభుత్వ పాలనలో ఉన్నందును మున్నూరుకాపులకు సరైన న్యాయం చేయాలని వారు కోరారు.
మాజీ మేయర్కు గౌరవప్రదమైన పదవి ఇవ్వాలి..
మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్కు జిల్లాలో గౌరవప్రదమైన పదవి ఇవ్వాలని వారు కోరారు. తద్వారా మున్నూరుకాపుల అభ్యున్నతికి నాంది పలకాలని వారు సూచించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోను మున్నూరుకాపులు క్రియాశీలకంగా పని చేశారన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపులకు ఇచ్చిన ప్రాతినిథ్యాన్ని ఎన్నటికీ మర్చిపోమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ మున్నూరుకాపులు అండగా ఉన్నారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
