HomeతెలంగాణConstable Pramod | కానిస్టేబుల్​ ప్రమోద్​ ఇంటికి డీజీపీ.. బాధిత కుటుంబానికి పరామర్శ

Constable Pramod | కానిస్టేబుల్​ ప్రమోద్​ ఇంటికి డీజీపీ.. బాధిత కుటుంబానికి పరామర్శ

రౌడీ షీటర్​ దాడిలో మృతి చెందిన కానిస్టేబుల్​ ప్రమోద్​ కుటుంబాన్ని డీజీపీ శివధర్​ రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట ఐజీ చంద్రశేఖర్​ రెడ్డి, సీపీ సాయిచైతన్య ఉన్నారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Constable Pramod | రౌడీ షీటర్​ దాడిలో మృతి చెందిన కానిస్టేబుల్​ ప్రమోద్​ కుటుంబాన్ని డీజీపీ శివధర్​ రెడ్డి (DGP Shivdhar Reddy) పరామర్శించారు. నిజామాబాద్​ నగరంలో (Nizamabad city) న్యూ బ్యాంక్​ కాలనీలో గల ప్రమోద్​ ఇంటికి మంగళవారం చేరుకున్నారు.

ఈ సందర్భంగా ప్రమోద్​ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సౌకర్యాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్​గ్రేషియాతో పాటు ఇంటి స్థలం, ఉద్యోగం వీలైనంత త్వరగా కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట ఐజీ చంద్రశేఖర్​ రెడ్డి (IG Chandrasekhar Reddy), సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya), అడిషనల్​ డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీ రాజా వెంకట్​ రెడ్డి, వెల్ఫేర్​ అసోసియేషన్​ సభ్యులు, పోలీసు సిబ్బంది ఉన్నారు.

కాగా.. అంతకుముందు నిజామాబాద్​ జిల్లాకు వచ్చిన డీజీపీకి ఐజీ చంద్రశేఖర్​ రెడ్డితో పాటు కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీజీపీకి పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం ఆయన కానిస్టేబుల్​ ప్రమోద్​ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.