HomeతెలంగాణDGP Jitender | డీజీపీ జితేంద‌ర్‌కు మాతృవియోగం.. సంతాపం తెలిపిన సీఎం

DGP Jitender | డీజీపీ జితేంద‌ర్‌కు మాతృవియోగం.. సంతాపం తెలిపిన సీఎం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : DGP Jitender | రాష్ట్ర డీజీపీ జితేంద‌ర్‌ (DGP Jitender) మాతృమూర్తి శుక్రవారం మృతి చెందారు. జితేంద‌ర్ త‌ల్లి కృష్ణ గోయ‌ల్‌(85) కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. హైదరాబాద్​ (Hyderabad)లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఆమె చనిపోయారు. జూబ్లీహిల్స్​ మ‌హాప్ర‌స్థానంలో గురువారం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

రాష్ట్ర డీజీపీ జితేందర్ మాతృమూర్తి మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర సంతాపాన్ని తెలిపారు. ఆ మరణం ఆ కుటుంబానికి తీరని లోటన్నారు. ఆ మాతృమూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. డీజీపీ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​, పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.