అక్షరటుడే, వెబ్డెస్క్ : DGP Jitender | రాష్ట్ర డీజీపీ జితేందర్ (DGP Jitender) మాతృమూర్తి శుక్రవారం మృతి చెందారు. జితేందర్ తల్లి కృష్ణ గోయల్(85) కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. హైదరాబాద్ (Hyderabad)లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఆమె చనిపోయారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో గురువారం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
రాష్ట్ర డీజీపీ జితేందర్ మాతృమూర్తి మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర సంతాపాన్ని తెలిపారు. ఆ మరణం ఆ కుటుంబానికి తీరని లోటన్నారు. ఆ మాతృమూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. డీజీపీ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.