అక్షరటుడే, వెబ్డెస్క్ : Plane Crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదం (Ahmedabad plane crash)లో ఎంతోమంది మరణించారు. ఈ ఘటనపై యావత్ దేశం విచారం వ్యక్తం చేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 269 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో విమానంలోని 241 మంది, మెడికల్ కాలేజీ విద్యార్థులు 28 మంది ఉన్నారు. విమాన ప్రమాదం నేపథ్యంలో డీజీసీఏ (DGCA) కీలక ఆదేశాలు జారీ చేసింది.
అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో ఎయిర్ ఇండియా (Air India)కు చెందిన బోయింగ్ 787–8 డ్రీమ్ లైనర్ కూలిపోయింది. ఈ క్రమంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్లోని అన్ని బోయింగ్ విమానాల (Boeing Planes) తనిఖీ చేయాలని ఆదేశించింది. బోయింగ్ విమానాలు తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని సూచించింది. DGCA ఆదేశాలతో ఎయిర్ ఇండియా చర్యలు చేపట్టింది. బోయింగ్ 787 సిరీస్ విమానాలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తోంది.
Plane Crash | అంతులేని విషాదం
విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. విమానంలోని ప్రయాణికులు సిబ్బంది కలిపి 241 మంది మరణించారు. విమానంలోని ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. మరోవైపు బీజే మెడికల్ విద్యార్థులు 28 మృతి చెందారు. మొదట 24 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. అయితే భవన శిథిలాల కింద మరో నలుగురి మృతదేహాలు లభించాయి. అహ్మదాబాద్లోని సివిల్ ఆస్పత్రి (Civil Hospital)లో డీఎన్ఏ టెస్ట్ చేసి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. తమ వారి మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు, బంధువులు సివిల్ ఆస్పత్రిలో నిరీక్షిస్తున్నారు.