Mla Dhanpal | ఏకాగ్రత పెంచుకోవడానికి భక్తి ఒక మార్గం: ఎమ్మెల్యే ధన్​పాల్

అక్షరటుడే గాంధారి: Mla Dhanpal | ఏకాగ్రత పెంచుకోవడానికి భక్తి ఒక మార్గమని ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana) అన్నారు. గాంధారి మండలంలోని నారాయణగిరి వద్ద వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం (Vasavi Kanyaka Parameshwari Temple) భూమిపూజకు కర్ణాటకలోని అల్దిపురం మఠం వామనాశ్రమ మహాస్వామీజీ విచ్చేయగా, ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ధన్​పాల్​ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి హిందువు మానసిక ప్రశాంతత కోసం దేవాలయాలను సందర్శించాలని సూచించారు. సనాతన ధర్మం […]

అక్షరటుడే గాంధారి: Mla Dhanpal | ఏకాగ్రత పెంచుకోవడానికి భక్తి ఒక మార్గమని ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana) అన్నారు. గాంధారి మండలంలోని నారాయణగిరి వద్ద వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం (Vasavi Kanyaka Parameshwari Temple) భూమిపూజకు కర్ణాటకలోని అల్దిపురం మఠం వామనాశ్రమ మహాస్వామీజీ విచ్చేయగా, ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ధన్​పాల్​ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి హిందువు మానసిక ప్రశాంతత కోసం దేవాలయాలను సందర్శించాలని సూచించారు. సనాతన ధర్మం (Sanatana Dharma) కాపాడుకునే బాధ్యత ప్రతిఒక్క హిందువుపై ఉందన్నారు. ధర్మ పరిరక్షణ కోసం కావడి నుంచి వారణాసి వరకు 4,500 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించిన హల్దిపురం మఠం స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అనంతరం కన్యకాపరమేశ్వరి ఆలయానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు కిషన్, పట్టణ అధ్యక్షుడు సంతోష్, లక్ష్మీకాంత్, దినేష్, ప్రశాంత్, సోమశేఖర్, రవి పాల్గొన్నారు.

Related articles

Kamareddy Education Demand | కామారెడ్డిలో విద్యాసంస్థల ఏర్పాటుపై దృష్టి పెట్టండి.. విద్యార్థి సంఘాల సూచన

ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాల్లో విద్యాసంస్థల ఏర్పాటుకు నాయకులు కృషి చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు సూచించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం మీడియాతో మాట్లాడారు.

Stock Market Crash | బేర్ దెబ్బకు కుదేలైన స్టాక్ మార్కెట్.. రూ. 2.71 లక్షల కోట్ల సంపద ఆవిరి

స్టాక్ మార్కెట్‌పై బేర్ పంజా విసిరింది. దీంతో అన్ని రంగాలూ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. సెన్సెక్స్ 1,145 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 288 పాయింట్ల నష్టంతో ముగిశాయి.

Mudhiraj Mahasabha Appointment | రాష్ట్ర ముదిరాజ్ మహాసభ బాన్సువాడ ఇన్​ఛార్జీగా మంత్రి గణేష్ నియామకం

తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ బాన్సువాడ నియోజకవర్గ ఇన్​ఛార్జీగా బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామానికి చెందిన మంత్రి గణేష్ నియమితులయ్యారు. ఆయనకు మంగళవారం నియామకపత్రం అందజేశారు.

AI Summit Protest | ఏఐ సదస్సులో ఆందోళన ఘటన.. ఢిల్లీ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి అరెస్ట్‌

ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌లో యూత్‌ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పి నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది