ePaper
More
    HomeతెలంగాణTraffic Jam | సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు.. 15 కి.మీ. మేర ట్రాఫిక్​ జామ్​

    Traffic Jam | సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు.. 15 కి.మీ. మేర ట్రాఫిక్​ జామ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Traffic Jam | కాళేశ్వరం(Kaleshwaram) త్రివేణి సంగమం వద్ద కొనసాగుతున్న సరస్వతి పుష్కరాల(Saraswathi Pushkaralu)కు భక్తులు పోటెత్తారు. రేపటితో పుష్కరాలు ముగియనుండటంతో పుణ్యస్నానాలు చేయడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో భూపాలపల్లి(Bhupalapalli) నుంచి కాళేశ్వరం మార్గంలో 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడంతో వాహనాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.

    Traffic Jam | అడవిలోకి మళ్లించడంతో..

    పుష్కరాలకు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో పోలీసులు వాహనాలను అడవి మార్గంలోకి మళ్లించారు. అనాలోచితంగా వాహనాలు మళ్లించడంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్​ జామ్​ అయింది. 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్​ స్తంభించడంతో ఐదు గంటలుగా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్​ పునరుద్ధరణకు పోలీసులు, అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే పోలీసుల వైఫల్యంతోనే ట్రాఫిక్​ జామ్(Traffic Jam)​ అయిందని భక్తులు ఆరోపిస్తున్నారు.

    More like this

    National Highway | అదుపు తప్పిన టిప్పర్.. తప్పిన భారీ ప్రమాదం

    అక్షరటుడే, డిచ్​పల్లి: National Highway | మండలంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది....

    CMRF Checks | బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

    అక్షరటుడే, ఆర్మూర్ : CMRF Checks | ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామానికి(Ramchandrapalli Village) చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న...

    Maoists | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా తిరుపతి నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా జగిత్యాల...