Telangana University
Telangana University | తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కాంగ్రెస్​తోనే సాధ్యం

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Telangana University | తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కాంగ్రెస్​తోనే​ సాధ్యమని ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరద బట్టు వేణురాజ్ (NSUI State General Secretary Varada Battu Venuraj) పేర్కొన్నారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy), పీసీసీ చీఫ్​ బొమ్మ మహేశ్​కుమార్​, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.

విశ్వవిద్యాలయానికి ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేసిన సందర్భంగా పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు. పదేళ్ల బీఆర్​ఎస్​ పాలనలో కలగానే మిగిలిన ఇంజినీరింగ్​ కళాశాల కాంగ్రెస్​ పాలనలో సాధ్యమైందన్నారు. కళాశాల సాధనలో జిల్లాలోని ప్రతిముఖ్య నాయకుడి పాత్ర ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు నవీన్, రమేష్, నరేందర్ సింగ్, సాయికిరణ్, కౌశిక్, మణి, రాజు పాల్గొన్నారు.