అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai | ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి దొంగలు కాపర్ ఆయిల్ చోరీ చేసిన ఇందల్వాయి మండలంలో (indalwai mandal) చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇందల్వాయిలోని వ్యవసాయ క్షేత్రాల్లో మూడు విద్యుత్ నియంత్రికలను దుండగులు ధ్వంసం చేశారు. అనంతరం అందులో నుంచి ఆయిల్, కాపర్ వైర్ దోచుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. రైతులు విద్యుత్ అధికారులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
