HomeతెలంగాణDengue | డెంగీ విజృంభణ.. ఒకే గ్రామంలో మంచం పట్టిన పదుల సంఖ్యలో ప్రజలు

Dengue | డెంగీ విజృంభణ.. ఒకే గ్రామంలో మంచం పట్టిన పదుల సంఖ్యలో ప్రజలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Dengue | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డెంగీ విజృంభిస్తోంది. విషజ్వరాలతో అనేక మంది మంచం పడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు (Private hospitals) పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. కాగా.. ఇటీవల కామారెడ్డి జిల్లా (Kamareddy district) పాల్వంచ మండలం భవానిపేట పరిధిలోని కిసాన్​ నగర్​లో 20 మందికి డెంగీ పాజిటివ్​ వచ్చిన విషయం తెలిసిందే.

నిజాంసాగర్​ మండలం వడ్డేపల్లిలో 14 ఏళ్ల బాలుడికి డెంగీ సోకింది. కాగా.. తాజాగా నిజామాబాద్​ జిల్లా (Nizamabad district) మోపాల్​ మండలం కాల్పోల్​ తండాలో డెంగీ (Dengue) విజృంభిస్తోంది. పదుల సంఖ్యలో ప్రజలు డెంగీ లక్షణాలతో బాధపడుతున్నారు. దీంతో వైద్య సిబ్బంది శనివారం గ్రామంలో శిబిరం ఏర్పాటు చేశారు. జ్వరాలతో బాధ పడుతున్న 30 మంది శాంపిల్స్​ తీసుకున్నారు. నలుగురు అనుమానిత శాంపిళ్లను ల్యాబ్​కు పంపించారు. కాగా.. డెంగీ లక్షణాలతో నిజామాబాద్​లోని ప్రైవేట్​ ఆస్పత్రుల్లో గ్రామానికి చెందిన 30 వరకు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వైద్య శిబిరంలో డిస్ట్రిక్ట్​ మలేరియా ఆఫీసర్​ రాథోడ్​, డాక్టర్​ ప్రత్యూష, డాక్టర్​ అజ్మత్​, గ్రామస్తులు ప్రతాప్​ సింగ్​ తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News