అక్షరటుడే, వెబ్డెస్క్: Pm Modi | ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh) భేటీ అయ్యారు. వీరి మధ్య దాదాపు 40 నిమిషాల పాటు సమావేశం జరిగింది. భారత్-పాక్ (Pak) సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, కశ్మీర్లో Kashmir సైనిక సన్నద్ధతపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అలాగే ఉగ్రవాదుల ఏరివేత చర్యలను వివరించినట్లు సమాచారం.
ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (National Security Advisor Ajit Doval) పాల్గొన్నారు. ప్రధాని మోదీతో సమావేశానికి ముందు రాజ్ నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్ (Army Chief)తో సమావేశం అయ్యారు.