అక్షరటుడే, ఇందూరు: TRSMA | బీసీ రిజర్వేషన్లకు (BC Reservations) అడ్డుకుంటున్న తీరును నిరసిస్తూ ఈనెల 18న జరుగనున్న రాష్ట్రవ్యాప్త బంద్కు అన్నివర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే వ్యాపార, వాణిజ్యసంస్థలు, ఆయా సంఘాలు బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అలాగే పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్కుమార్ సైతం కాంగ్రెస్ తరపున బంద్కు సహకరిస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సైతం నిరసనలో పాల్గొంటామని స్పష్టం చేసింది..
TRSMA | విద్యాసంస్థలు సైతం..
బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంద్కు తాము మద్దతు తెలుపుతున్నట్లు తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (TRSMA) ప్రకటించింది.
ఈ మేరకు ట్రస్మా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుందర్, అనుముల క్రాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఈనెల 18న బంద్ పాటించి బీసీలకు మద్దతు తెలిపాలని కోరారు.