అక్షరటుడే, వెబ్డెస్క్: PCC Chief : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ షాకింగ్ గణాంకాలు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ హయాం గురించి మాట్లాడుతూ ఆవేశం మాట్లాడిని వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మన పీసీసీ చీఫ్ గణాంకాలను చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఆ తర్వాత కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.
గత భారాస పాలనపై ఆవేశంగా మాట్లాడిన పీసీసీ చీఫ్.. అప్పులపై తప్పులు వల్లించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రానికి ఏకంగా ‘రూ. 8 లక్షలు’ అప్పు చేసి ఫాం హౌజ్ లో పడుకున్నారని మహేష్కుమార్ గౌడ్ ఆవేశంగా వ్యాఖ్యానించారు.
PCC Chief : ఆర్మూర్లో పాదయాత్ర..
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ Meenakshi Natarajan శనివారం (ఆగస్టు 2) పాదయాత్ర చేపట్టారు. ముందుగా ఆలూర్ బైపాస్లో కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. అనంతరం మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (PCC Chief Bomma Mahesh Kumar Goud) పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్కుమార్ గౌడ్ ప్రసంగించారు.
మాజీ సీఎం కేసీఆర్ను టార్గెట్ చేస్తూ.. మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కానీ, తాను ఏమి మాట్లాడుతున్నాననే విషయాన్ని మాత్రం గ్రహించలేకపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత పదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పులు రూ. 8 లక్షలు అంటూ చెప్పుకొచ్చారు.
కేసీఆర్ చేసిన అప్పులకు రూ. 6 కోట్ల అప్పులు చెల్లిస్తున్నామంటూ ఆవేశంతో ఊగిపోయారు. కాగా, ఆయన మాటలు విని కాంగ్రెస్ నేతలే ఖంగుతిన్నారు. ఇక, ప్రజలైతే తలలు గోక్కున్నారు.
PCC Chief : సోషల్ మీడియాలో ట్రోల్..
తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయన మాటలపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.