Homeజిల్లాలుకామారెడ్డిKamareddy GGH | కామారెడ్డి జీజీహెచ్​లో ఒకరి మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న బంధువులు

Kamareddy GGH | కామారెడ్డి జీజీహెచ్​లో ఒకరి మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న బంధువులు

కామారెడ్డి జీజీహెచ్​లో ఓ వృద్ధుడు మృతి చెందాడు. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి సకాలంలో వైద్యం అందించకపోవడంతోనే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy GGH | కామారెడ్డి జీజీహెచ్​లో శనివారం ఓ వృద్ధుడు మృతి చెందాడు. అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే (doctors negligence) అతడు మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. బాధితుల కథనం ప్రకారం..

కామారెడ్డి పట్టణానికి (Kamareddy Town) చెందిన ఎంబరి తిరుపతి(55)ని కుటుంబ సభ్యులు శనివారం మధ్యాహ్నం 1 గంటలకు జీజీహెచ్​కు తీసుకొచ్చారు. బీపీ, షుగర్ ఎక్కువ కావడంతో అప్పటికే ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారిందని దీంతో ఆస్పత్రిలో అడ్మిట్​ చేసుకోవానలి డ్యూటీ డాక్టర్​ను (Duty Doctor) రోగి కుటుంబసభ్యులు కోరారు. అయితే ఐసీయూలో బెడ్స్ ఖాళీగా లేవని ఆయనను అడ్మిట్ చేసుకోలేదు. కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఐసీయూలో బెడ్లు ఖాళీగా కనిపించగా వైద్యుడిని నిలదీశారు.

కాని పేషంట్​కు కాన్సంట్రేటర్ ఆక్సిజన్ (concentrator oxygen) కావాల్సి ఉందని, ఐదు నెలలుగా ఆస్పత్రిలో కాన్సంట్రేటర్ ఆక్సిజన్ అందుబాటులో లేదని సాయంత్రం 5గంటలకు డ్యూటీ డాక్టర్​ సమాధానమిచ్చారు. కాసేపటికే తిరుపతి మృతి చెందాడు. దాంతో బాధిత కుటుంబ సభ్యులు వైద్యుడితో వాగ్వాదానికి దిగారు. బెడ్స్ ఖాళీగా ఉన్నా లేవని ఎందుకు నిర్లక్ష్యం చేశారని నిలదీశారు.

Kamareddy GGH | ఒక్క పేషంట్​నే చూసుకుంటూ ఉంటామా..?

ఐదు గంటలుగా అడ్మిట్ చేసుకోకపోవడంతో పేషంట్ (patient) మృతి చెందిన విషయమై డ్యూటీ డాక్టర్​ను వివరణ కోరగా.. ఆస్పత్రిలో ఒక్క పేషంట్​తోనే ఉంటామా.. మిగితా పేషంట్లను ఎవరు చూస్తారు.. అంటూ ఆయన నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. కాన్సంట్రేటర్​ ఆక్సిజనల్​ లేదని కూడా సంబంధిత ఇన్​ఛార్జి వైద్యుడు చెప్పాడని డ్యూటీ డాక్టర్​ చెప్పగా.. ఇన్​ఛార్జి మాత్రం డ్యూటీ డాక్టర్​కే అంతా తెలుసని చెప్పడం కొసమెరుపు. ఇలా ఒకరిపై ఒకరు నెపాన్ని నెట్టుకుంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం రోజురోజుకూ పెరిగిపోతోందని రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.