Homeక్రైంNavipet | లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. ఇంటర్​ విద్యార్థిని మృతి

Navipet | లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. ఇంటర్​ విద్యార్థిని మృతి

- Advertisement -

అక్షరటుడే, బోధన్​: Navipet | లారీ ఢీకొట్టిన ఘటనలో ఇంటర్​ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బినోల గ్రామానికి చెందిన బైండ్ల గంగాధర్​ నవీపేట్​లో సీడ్స్​షాప్​ నిర్వహిస్తున్నాడు. తన కూతురు తేజస్విని నిజామాబాద్​లోని (Nizamabad ) ఎస్​ఆర్​ కళాశాలలో (SR Inter college) ఫస్ట్​ ఇయర్​లో చేర్పించారు. సోమవారం కళాశాలలో వదిలిపెట్టేందుకు నవీపేట్​ నుంచి గంగాధర్ బైక్​పై కూతురితో బయలుదేరాడు. అయితే నవీపేట్​ మెయిన్​ సెంటర్లో వీరి బైక్​ను వెనక నుంచి లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో​ గంగాధర్​ ఎడమవైపు పడిపోగా.. తేజస్విని కుడివైపుకు పడిపోవడంతో లారీ టైర్లు ఆమె తలపైనుంచి వెళ్లాయి. దీంతో తేజస్విని తలపగిలి సంఘటనా స్థలంలోనే మృతిచెందింది. కళ్లముందే కూతురు మృతి చెందడంతో గంగాధర్​ అల్లాడిపోయాడు. కన్నీరు మున్నీరుగా విలపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

Navipet | ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్​..

నవీపేట మెయిన్​ సెంటర్లో వాహనాల పార్కింగ్​ ఇష్టారాజ్యంగా మారడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. పోలీసులు స్పందించి ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించాలని వారు కోరుతున్నారు.