Homeజిల్లాలుకామారెడ్డిRation Rice | రేషన్ బియ్యం అమ్ముకున్న డీలర్.. విచారణలో తేల్చిన అధికారులు

Ration Rice | రేషన్ బియ్యం అమ్ముకున్న డీలర్.. విచారణలో తేల్చిన అధికారులు

లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన రేషన్​ బియ్యాని ఓ డీలర్​ పక్కదారి పట్టించారు. ప్రజలు ఫిర్యాదు చేయడంతో విచారించిన అధికారులు బియ్యంను అమ్మేసినట్లు విచారణలో తేల్చారు.

- Advertisement -

అక్షరటుడే, గాంధారి: Ration Rice | లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన రేషన్​ బియ్యంను ఓ రేషన్​ డీలర్ (Ration dealer)​ దర్జాగా అమ్మేసుకున్నారు. రేషన్​షాపు నిర్వాహకుల తీరుపై అనుమానం వచ్చిన ప్రజలు.. అధికారులకు ఫిర్యాదు చేయడంతో బండారం బయటపడింది.

ఈ ఘటన గాంధారి (Gandhari) మండలం గండివేట్​లో జరిగింది. స్థానికులు తెలిసిన వివరాల ప్రకారం.. మండలంలోని గండివేట్​లోని (Gandivet) ఓ రేషన్​ డీలర్​ కొన్నిరోజులుగా రేషన్​ బియ్యం పంపిణీ చేయట్లేదు. లబ్ధిదారులు అడిగితే రేపుమాపు అంటూ వారు పొంతనలేని సమాధానం చెబుతూ వస్తున్నారు.

దీంతో విసిగిపోయిన ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్​ఫోర్స్​మెంట్​ (Enforcement Department) డీటీ సురేష్​ విచారణ చేశారు. రేషన్​ షాప్​లో మొత్తంగా 218 క్వింటాళ్లకు పైగా రేషన్ ​బియ్యం మాయమైనట్లు విచారణలో తేల్చారు. తదుపరి చర్యల నిమిత్తం ఆర్డీవోకు నివేదిక అందజేస్తామని ఆయన వివరించారు.