Homeతాజావార్తలుHyderabad | ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం.. తప్పిన ప్రమాదం

Hyderabad | ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం.. తప్పిన ప్రమాదం

హైదరాబాద్​ నగరంలో శుక్రవారం రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆరాంఘర్​ చౌరాస్తా వద్ద ఆర్టీసీ బస్సును ఢీసీఎం ఢీకొంది. శంషాబాద్ సిద్ధాంతి ఫ్లైఓవర్​పై లారీ దగ్ధమైంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​లో మరో బస్సు ప్రమాదం జరిగింది. సిగ్నల్​ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సు (RTC Bus)ను డీసీఎం ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు.

రాజేంద్రనగర్ పోలీస్​ స్టేషన్​ (Rajendranagar Police Station) పరిధిలోని ఆరాంఘర్‌ చౌరస్తా సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొంది. శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. షాద్​నగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బస్సును డీసీఎం బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Hyderabad | లారీ దగ్ధం

శంషాబాద్ సిద్ధాంతి ఫ్లైఓవర్​ (Shamshabad Siddhanthi Flyover)పై శుక్రవారం ఉదయం లారీ దగ్ధమైంది. హైదరాబాద్ బెంగుళూరు హైవే ఫ్లై ఓవర్ పై వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన డ్రైవర్​ లారీని పక్కన ఆపాడు. అనంతరం ఫైర్​ ఇంజిన్​కు సమాచారం ఇచ్చాడు. అయితే అగ్ని మాపక సిబ్బంది రావడం ఆలస్యం కావడంతో స్థానికులు మున్సిపాలిటీకి చెందిన వాహనంతో మంటలను ఆర్పేశారు.

Hyderabad | వరుస ప్రమాదాలు

ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చేవెళ్ల వద్ద ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీకొనడంతో 19 మంది చనిపోయారు. అంతకు ముందు కర్నూల్​ వద్ద ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సు కాలిపోయి 19 మంది సజీవ దహనం అయ్యారు. ప్రైవేట్​ ట్రావెల్స్​, ఆర్టీసీ బస్సులు అని తేడా లేకుండా ప్రమాదాలకు గురి అవుతుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

Must Read
Related News