HomeతెలంగాణCM Revanth Reddy | బీజేపీ, బీఆర్ఎస్‌ మధ్య చీకటి ఒప్పందం.. సీఎం రేవంత్​రెడ్డి సంచలన...

CM Revanth Reddy | బీజేపీ, బీఆర్ఎస్‌ మధ్య చీకటి ఒప్పందం.. సీఎం రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy | సీఎం రేవంత్​రెడ్డి బీజేపీ, బీఆర్​ఎస్​పై తీవ్ర విమర్శలు చేశారు. చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవంలో ఆయన మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | సీఎం రేవంత్​రెడ్డి బీజేపీ (BJP), బీఆర్​ఎస్ (BRS)​పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు.

హైదరాబాద్ (Hyderabad) నగరంలోని చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవంలో సీఎం రేవంత్​రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. దేశ సమగ్రతను కాపాడడానికి రాజీవ్​గాంధీ సద్బావన యాత్ర చేపట్టారన్నారు. ఆ కార్యక్రమాన్ని నేటికి కొనసాగిస్తుండడం అభినందనీయమన్నారు. సీనియర్​ నాయకుడు సల్మాన్​ ఖుర్షిద్​ను రాజీవ్​ సద్భావన అవార్డుకు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.

CM Revanth Reddy | బీజేపీకి బీ టీమ్

బీజేపీకి బీఆర్ఎస్ బీటీమ్‌గా మారిందని రేవంత్​రెడ్డి విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ డిపాజిట్లు కోల్పోయిందన్నారు. ఆ 8 స్థానాల్లో బీజేపీ గెలిచిందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు 37 శాతం ఓట్లు వచ్చాయని, నాలుగు నెలల్లో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో 15 శాతం ఓట్లే వచ్చాయన్నారు. మిగతా 22 శాతం ఓట్లు ఎటుపోయాయని ఆయన ప్రశ్నించారు. ఆ ఓట్లు బీజేపీకి వెళ్లాయన్నారు. ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం ఉందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉపఎన్నికల్లోనూ ఇదే కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

కుట్రలు, కుతంత్రాలు చేసే వారిని తిప్పికొట్టాలని ఆయన ప్రజలను కోరారు. జరగబోయే ఎన్నికల్లో చీలిక తీసుకు రావాలని బీఆర్​ఎస్​ చూస్తోందన్నారు. రిజర్వేషన్లు పెరగకుండా ఆ రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయన్నారు. మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి (Minister Uttam Kumar Reddy) మాట్లాడుతూ.. కాంగ్రెస్​ ప్రభుత్వం చిత్తశుద్ధితో కులగణన చేపట్టిందన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లులు ఆమోదించినట్లు గుర్తు చేశారు. దీనికి న్యాయవ్యవస్థలో చిక్కులు వస్తున్నాయన్నారు. తాము చిత్తశుద్ధితో రిజర్వేషన్ల కోసం ఆలోచిస్తుంటే.. కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ, సీనియర్​ నాయకులు వి హనుమంతురావు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ గౌడ్​ పాల్గొన్నారు.