HomeతెలంగాణIndalwai | ప్రమాదకరంగా విద్యుత్​తీగలు.. పట్టించుకోని అధికారులు

Indalwai | ప్రమాదకరంగా విద్యుత్​తీగలు.. పట్టించుకోని అధికారులు

- Advertisement -

అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | మండలంలోని చంద్రాయన్​ పల్లి(Chandrayan Palli)లో విద్యుత్​ తీగలు ప్రమాదకరంగా మారాయి. 44వ జాతీయ రహదారి పక్కనే విద్యుత్​ తీగలు కిందికి వేళాడుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని గ్రామస్థులు వాపోతున్నారు. దీంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం వస్తున్నందున త్వరితగతిన నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Must Read
Related News