ePaper
More
    HomeజాతీయంCyber Fraud | డిజిటల్​ అరెస్ట్​ పేరిట రూ.3.72 కోట్లు కాజేసిన సైబర్​ నేరగాళ్లు

    Cyber Fraud | డిజిటల్​ అరెస్ట్​ పేరిట రూ.3.72 కోట్లు కాజేసిన సైబర్​ నేరగాళ్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyber Fraud | సైబర్​ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. సైబర్​ నేరాలపై పోలీసులు (Police) అవగాహన కల్పిస్తున్నా.. కొంతమంది మోసపోతూనే ఉన్నారు.

    డిజిటల్​ అరెస్ట్​ (digital arrest) పేరిట ఇటీవల సైబర్​ నేరగాళ్లు పలువురిని మోసం చేస్తున్నారు. అరెస్ట్​ చేస్తామని భయపెట్టి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. మీపై కేసులు నమోదు అయ్యాయని, తాము చెప్పినట్లు చేయకపోతే అరెస్ట్​ చేస్తామని భయపెడుతున్నారు. వారి మాటలు నమ్మిన అమాయకులు నిజమైన పోలీసులు అనుకొని డబ్బులు బదిలీ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన కేరళలో (Kerala) చోటు చేసుకుంది.

    Cyber Fraud | వాట్సాప్​ కాల్​ చేసి..

    కేరళలోని కొల్లాంలో 79 ఏళ్ల వృద్ధుడికి జులై 7న సైబర్​ నేరగాళ్లు ఫోన్​ చేశారు. వాట్సప్‌లో వీడియో కాల్‌ చేసి తాను బీఎస్‌ఎన్‌ఎల్ అధికారిని అంటూ నిందితుడు పరిచయం చేసుకున్నారు. సదరు వృద్ధుడి ఫోన్​ నంబర్​ను అక్రమ కార్యకలాపాలకు వినియోగించారని, ముంబై సైబర్​ క్రైమ్​ పోలీసులు (Mumbai Cyber ​​Crime Police) ట్రాక్​ చేస్తున్నారని చెప్పారు. అనంతరం మరో వ్యక్తి పోలీసు దుస్తుల్లో సదరు వృద్ధుడికి ఫోన్​ చేశాడు. ముంబై సైబర్‌ పోలీసులమని చెప్పి నకిలీ అరెస్ట్​ వారెంట్ చూపించాడు. డిజిటల్​ అరెస్ట్​ చేశామని వృద్ధుడిని బెదిరించాడు.

    Cyber Fraud | నకిలీ కోర్టుతో..

    వృద్ధుడిని అరెస్ట్​ చేశామని సైబర్​ నేరగాళ్లు చెప్పారు. అంతేగాకుండా వర్చువల్​గా నకిలీ కోర్టులో ప్రవేశ పెట్టి బెయిల్​ సైతం వారే ఇచ్చారు. అనంతరం ఆయన ఖాతాలోని నగదును తాము చెప్పిన అకౌంట్లలోకి బదిలీ చేయాలని ఆదేశించారు. లేదంటే అరెస్ట్​ చేస్తామని బెదిరించారు. దీంతో సదరు వృద్ధుడు జులై 23 నుంచి ఆగస్టు 29 వరకు విడతల వారు చెప్పిన ఖాతాల్లో రూ.3.72 కోట్లను ట్రాన్స్​ఫర్​ చేశాడు. అయితే వారు డబ్బు తిరిగి పంపకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

    Cyber Fraud | అప్రమత్తంగా ఉండాలి

    సైబర్​ నేరాల (Cyber Frauds)పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరు ఊరికే ఎవరూ గిఫ్ట్​లు ఇవ్వరని, అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల సందేశాలకు స్పందించవద్దని సూచించారు. అలాగే ఎవరైనా ఫోన్​ చేసి తాము పోలీసులం, సీబీఐ ​ అధికారులమని(CBI Officers) చెప్పి బెదిరిస్తే భయపడకుండా ఉండాలన్నారు. అధికారులు అలా ఫోన్లు చేయరని చెప్పారు. అలాంటి వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేయవద్దన్నారు. ఎవరైనా అలా ఫోన్​ చేస్తే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్​ 1930కి సమాచారం అందించాలని సూచించారు.

    More like this

    Telangana | ఇవేం పాలి”ట్రిక్స్‌”? ఫిరాయింపుల‌పై జ‌నం చీద‌రింపులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana | పార్టీ ఫిరాయింపుల ప‌ర్వం ఇప్పుడు రాష్ట్రంలో కొత్త చ‌ర్చ‌కు దారి తీసింది....

    Lingampet | కరెంట్​ షాక్​తో మూడు గేదెలు మృతి

    అక్షరటుడే, లింగంపేట : Lingampet | లింగంపేట మండలం భవానిపేట గ్రామ (Bhawanipet village) శివారులో కరెంట్ షాక్​తో...

    Bheemgal | స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి

    అక్షరటుడే, భీమ్​గల్ : Bheemgal | రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) బీజేపీ అభ్యర్థుల...