Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | కోతులు రాకుండా కరెంట్​ పెట్టాడు.. ఆ వైర్లకు తగిలి వ్యక్తి మృతి

Yellareddy | కోతులు రాకుండా కరెంట్​ పెట్టాడు.. ఆ వైర్లకు తగిలి వ్యక్తి మృతి

కోతులు రాకుండా ఇంట్లో వైర్లు బిగించి కరెంట్​ సరఫరా చేయగా.. ఆ వైర్లకే తాకి ఓ వ్యక్తి ప్రాణం పోయింది. ఎల్లారెడ్డిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ఇంట్లోకి కోతులు వస్తున్నాయని వాటిని నిలువరించేందుకు ఓ వ్యక్తి కరెంట్​ వైర్లు బిగించగా.. అమర్చిన విద్యుత్​ ​తీగలతో ఆ వ్యక్తి ప్రాణం పోయింది. ఈ విషాదకర ఘటన ఎల్లారెడ్డి మండలంలో చోటు చేసుకుంది.

ఎల్లారెడ్డి ఎస్సై మహేష్(SI Mahesh)​ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కళ్యాణి గ్రామానికి చెందిన బండారి దుర్గయ్య(42) ఇంట్లో ఓవైపు కూలిపోయి ఓ రంధ్రం ఏర్పడింది. దీంతో ఆ రంధ్రానికి జేవైర్​ను చుట్టాడు. అయినప్పటికీ కోతులు ఇంట్లోకి వస్తున్నాయి.

కోతులు రాకుండా ఆ జేవైర్​కు కరెంట్ కనెక్షన్​ ఇచ్చాడు. ఈ క్రమంలో సోమవారం జేవైర్​ను సరిచేస్తుండగా.. కరెంట్​షాక్​ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య కిష్టవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.