అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Chinese manja | చైనా మాంజాతో ఎవరికైనా హాని కలిగితే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.
Chinese manja | మనుషులు, పక్షులకు ప్రమాదం..
నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ (District Police Commissionerate) పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని ప్రజలకు సీపీ సాయిచైతన్య ఈ సందర్భంగా సూచనలు చేశారు. చైనామాంజా కారణంగా మనుషులతో పాటు పక్షులు, పశువులకు ప్రమాదం జరుగుతుందన్నారు. ఈ చైనామాంజా కారణంగా ఎవరైనా వ్యక్తులకు ప్రాణహాని కలిగితే సంబంధిత చైనామాంజా (Chinese manja) వినియోగించిన, విక్రయించిన వారిపై క్రిమినలు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి
కొంతమంది ఇప్పటికే హైదరాబాద్ (Hyderabad) నుంచి నిజామాబాద్కు చైనామాంజా తరలించినట్లు పోలీసులకు సమాచారం ఉందని సీపీ తెలిపారు. ముందుగానే సదరు వ్యక్తులు వెంటనే తమవద్ద ఉన్న చైనామాంజాను స్థానిక పోలీస్స్టేషన్లో అప్పగించాలని సూచించారు. లేదా కాల్చివేయాలన్నారు. చైనామాంజా నిల్వ ఉంచినా.. విక్రయిస్తున్నా.. వారి వివరాలు పోలీసులకు అందజేయాలని కోరారు. వివరాలిచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు.
