CP Sai Chaitanya | జిల్లాలో నేరాలను అదుపు చేశాం: సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: CP Sai Chaitanya | జిల్లాలో ఈ ఏడాది నేరాలను అదుపు చేశామని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) తెలిపారు. ఈ మేరకు మంగళవారం సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వార్షిక ప్రణాళికను వెల్లడించారు. CP Sai Chaitanya | నాలుగు శాతం తగ్గిన క్రైం రేట్​.. ఈ ఏడాది నిజామాబాద్ జిల్లాలో క్రైం రేటు నాలుగు శాతం తగ్గిందని సీపీ వెల్లడించారు. మహిళలలపై అఘాయిత్యాలు, ఫోక్సో కేసులు (POCSO […]

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: CP Sai Chaitanya | జిల్లాలో ఈ ఏడాది నేరాలను అదుపు చేశామని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) తెలిపారు. ఈ మేరకు మంగళవారం సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వార్షిక ప్రణాళికను వెల్లడించారు.

CP Sai Chaitanya | నాలుగు శాతం తగ్గిన క్రైం రేట్​..

ఈ ఏడాది నిజామాబాద్ జిల్లాలో క్రైం రేటు నాలుగు శాతం తగ్గిందని సీపీ వెల్లడించారు. మహిళలలపై అఘాయిత్యాలు, ఫోక్సో కేసులు (POCSO cases) స్వల్పంగా పెరిగాయన్నారు. జిల్లాలో గ్యాంగ్ వార్ లేకుండా చేశామని సీపీ వెల్లడించారు. డ్రంకన్​ డ్రైవ్​పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, కఠినంగా వ్యవహరించామని తెలియజేశారు.

పెరిగిన సైబర్​ క్రైంలు..

జిల్లాలో సైబర్ క్రైం​లు పెరిగాయని సీపీ తెలిపారు. సైబర్ నేరాల విషయంలో గతేడాదితో పోలిస్తే 30శాతం పెరుగుదల ఉందన్నారు. డిజిటల్ మోసాలు సైబర్ నేరగాళ్ల విషయంలో మోసపోకుండా ఉండేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్య పరుస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా డిజిటల్ ప్లాట్​ఫామ్​లపై (digital platforms) ప్రజలు మోసపోతున్నారని ఆయన తెలిపారు.

బాధితులకు అండగా ఉన్నాం..

సైబర్ క్రైం నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితుల నుంచి స్వీకరించిన ఫిర్యాదులపై వెనువెంటనే స్పందిస్తూ డబ్బులను రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగిందన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది రికవరీ రేటు పెరిగిందని పేర్కొన్నారు. పోలీసులు అంకిత భావంతో పనిచేస్తూ లా అండ్ ఆర్డర్​ను పరిరక్షించేందుకు కృషిచేస్తున్నారన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులను ఆదేశిస్తూ తగిన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. నూతన సంవత్సర వేడుకలు నిబంధనల మేరకు జరుపుకోవాలని సీపీ సూచించారు. యువత హద్దు మీరితే కఠినచర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.

Related articles

Maoist Movement End Phase | ముగిసిన మావోయిస్టుల ఉద్యమ ప్రస్థానం!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoist Movement End Phase | ఒకప్పుడు దేశంలోని పలు ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాలు నడిపిన మావోయిస్టు పార్టీ ఉద్యమ...

Balakrishna House Car Accident | బాలకృష్ణ ఇంటి వద్ద కారు బీభత్సం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Balakrishna House Car Accident | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా ప్రయాణిస్తున్న కారు...

Modi Launches Namo Bharat | తొలి హైస్పీడ్​ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi Launches Namo Bharat | ఉత్తర ప్రదేశ్​లోని మీరట్​లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం...

Eco Run 2.0: మాదాపూర్‌లో మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0 సందడి.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా 4,200 మంది పరుగు

హైదరాబాద్: ఐటీ హబ్ మాధాపూర్‌లో ఆదివారం ఉదయం పరుగు ఉత్సాహం ఉప్పొంగింది. మైండ్‌స్పేస్ REIT, మిర్చి సంయుక్తంగా నిర్వహించిన మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0...