అక్షర టుడే, వెబ్ డెస్క్: Cricket Tournament | బిచ్కుంద మండల (Bichkunda Mandal) కేంద్రంలో v 59 ఛానల్ ఆధ్వర్యంలో సోమవారం క్రికెట్ టోర్నీ నిర్వహించారు. ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు (MLA Thota Lakshmi Kantharao) హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలతో శరీర ధారుడ్యంతో పాటు మానసికోల్లాసం పొందవచ్చన్నారు. ప్రతిఒక్కరూ క్రీడలు ఆడాలని సూచించారు. చిన్నపటి నుంచి పిల్లలకు సైతం ఆటలు ఆడించాలని వివరించారు. చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనని తెలిపారు. కార్యక్రమంలో టోర్నీ నిర్వాహకులు పాల్గొన్నారు.