అక్షరటుడే, బోధన్: CP Sai Chaitnaya | జానకంపేట (janakamPet) లక్ష్మీనృసింహస్వామిని (Lord Lakshmi Narasimha Swamy) సీపీ సాయిచైతన్య మంగళవారం దర్శించుకున్నారు. ఈ మేరకు ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను పూజారులు సీపీకి వివరించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సీపీతో పాటు రూరల్ సీఐ విజయ్బాబు (CI VijayBabu), ఎడపల్లి ఎస్సై రమ్య తదితరులు ఉన్నారు.