Homeజిల్లాలునిజామాబాద్​CP Sai Chaitanya | గాయపడిన పోలీసులను పరామర్శించిన సీపీ

CP Sai Chaitanya | గాయపడిన పోలీసులను పరామర్శించిన సీపీ

నగరానికి చెందిన హోంగార్డు భూమయ్య, ఆయన కుమార్తె కానిస్టేబుల్​ మాధురి రోడ్డు ప్రమాదం ఇటీవల గాయపడ్డారు. చికిత్స పొందుతున్న వారిని సీపీ సాయి చైతన్య సోమవారం పరామర్శించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CP Sai Chaitanya | రోడ్డు ప్రమాదంలో గాయపడిన పోలీస్​ సిబ్బందిని సీపీ సాయి చైతన్య సోమవారం పరామర్శించారు. నిజామాబాద్​ నగరంలోని సాయినగర్​ –2 నుంచి హోంగార్డు అల్లం భూమయ్య, తన కూతురు మాధురి (కానిస్టేబుల్​)ని విధులకు తీసుకు వెళ్లే సమయంలో ఈ నెల 9న ప్రమాదం జరిగింది.

వీరి బైక్​ను ఎదురుగా వస్తున్న మరో బైక్​ ఢీకొంది. దీంతో భూమయ్య, మాధురి గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని సీపీ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Must Read
Related News