అక్షరటుడే, వెబ్డెస్క్ : CP Sai Chaitanya | రోడ్డు ప్రమాదంలో గాయపడిన పోలీస్ సిబ్బందిని సీపీ సాయి చైతన్య సోమవారం పరామర్శించారు. నిజామాబాద్ నగరంలోని సాయినగర్ –2 నుంచి హోంగార్డు అల్లం భూమయ్య, తన కూతురు మాధురి (కానిస్టేబుల్)ని విధులకు తీసుకు వెళ్లే సమయంలో ఈ నెల 9న ప్రమాదం జరిగింది.
వీరి బైక్ను ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొంది. దీంతో భూమయ్య, మాధురి గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని సీపీ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
