అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లతో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారికి పలు కీలక సూచనలు చేశారు.
ఎంపిక చేసిన కేసుల్లో ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు దర్యాప్తు చేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు దర్యాప్తు విషయంలో వారి సందేహాలను నివృత్తి చేశారు. అదృశ్యం కేసులు, అసహజ మరణాల కేసుల విచారణ ఏ విధంగా చేయాలో వివరించారు. కాన్ఫరెన్స్లో అదనపు డీసీపీ (అడ్మిన్) జి బస్వారెడ్డి, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ పాల్గొన్నారు.