అక్షరటుడే, ఆర్మూర్: CP Sai Chaitanya క్రీడలతో మానసిక ఎదుగుదల ఉంటుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు.
పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం Police Martyrs’ Commemoration Day లో భాగంగా ఆర్మూర్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం మండల స్థాయి వాలీబాల్ volleyball, కబడ్డీ kabaddi పోటీలను నిర్వహించారు.
CP Sai Chaitanya | గౌరవ వందనం స్వీకరణ..
ప్రారంభ కార్యక్రమానికి సీపీ ముఖ్యఅతిథిగా హాజరై క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, సీఐ సత్యనారాయణ, ఎంఈఓ రాజగంగారాం, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీ నరసయ్య, పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
